Share News

S.Jaishankar: లాడెన్ పాక్ సైనిక నగరంలో ఎలా ఉండగలిగాడు.. జైశంకర్ సూటి ప్రశ్న

ABN , Publish Date - Jun 11 , 2025 | 06:40 PM

రష్యాపై వెస్ట్ దేశాల ఆంక్షలు విధించినప్పుడు ఇండియా ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని తాము నమ్ముతామని జైశంకర్ చెప్పారు.

S.Jaishankar: లాడెన్ పాక్ సైనిక నగరంలో ఎలా ఉండగలిగాడు.. జైశంకర్ సూటి ప్రశ్న
Jai Shankar

బ్రసెల్స్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇండియా-పాక్ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కేవలం రెండు పొరుగుదేశాల మధ్య సమస్యగా చూపించే ప్రయత్నం సరికాదని, అది ఉగ్రవాదంపై జరిపిన పోరాటమని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) అన్నారు. ఇదే టెర్రరిజం పశ్చిమదేశాలను కూడా వెంటాడుతూ వస్తుందని స్పష్టం చేశారు. యూరోపియన్ న్యూస్ వెబ్‌సైట్ 'యూరాక్టివ్'కి బుధవారంనాడిచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


లాడెన్‌నే ఊదాహరణగా తీసుకోండి

ఆపరేషన్ సిందూర్‌ను రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సమస్యగా పశ్చిమ దేశాలు చూపించే ప్రయత్నాన్ని తప్పుపట్టారు. 'మీకు ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను. ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను పాకిస్థాన్ మిలటరీ టౌన్‌లో ఏళ్ల తరబడి ఎందుకు సురక్షితంగా ఉండగలిగాడు? ఇదే టెర్రరిజం మిమ్మల్ని కూడా వెంటాడుతూ వస్తుందని గ్రహించాలి' అని పశ్చిమ దేశాలకు జైశంకర్ హెచ్చరిక చేశారు. ఈయూ-భారత్‌ మధ్య 'ఫ్రీ ట్రేడ్' ప్రస్తావన చేస్తూ, భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉందని, చైనా కంటే నిపుణ కార్మికులు, విశ్వసనీయ భాగస్వామ్యం ఇవ్వగలదని అన్నారు.


రష్యాపై వెస్ట్ దేశాల ఆంక్షలు విధించినప్పుడు ఇండియా ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని తాము నమ్ముతామని చెప్పారు. రణరంగం నుంచి పరిష్కారం లభిస్తుందని తాము భావించమని, అలాగని పరిష్కారం గురించి చెప్పడం కూడా తమ పని కాదని, కానీ పరిష్కారంలో భాగమవుతామని వివరించారు. కేవలం రష్యాతోనే కాకుండా ఉక్రెయిన్‌తో కూడా ఇండియాకు మంచి సంబంధాలున్నాయని, అయితే ప్రతి దేశం సహజంగానే తమ సొంత అనుభవాలు, చరిత్ర, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని అన్నారు.


భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాక్ ఆక్రమణదారులను కశ్మీర్‌కు పంపిందని, అప్పుడు సపోర్ట్ చేసిన ఎక్కువ దేశాలు వెస్ట్రన్ దేశాలేనని జైశంకర్ గుర్తుచేశారు. ఇప్పుడు అదే దేశాలు అంతర్జాతీయ సిద్ధాంతాలంటూ మాట్లాడుతున్నాయని, గతాన్ని గుర్తుంచుకోవాలని తాను అడగడానికి సరైన కారణం ఉందనే అనుకుంటున్నానని అన్నారు.


అమెరికాతో సంబంధాలపై జైశంకర్ మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను కాపాడే ప్రతి సంబంధాన్ని ముందుకు తీసుకు వెళ్తామని, అమెరికా తమకు అత్యంత ముఖ్యమైన దేశమని అన్నారు. ఇది ఒక ఫలానా వ్యక్తి అనో (ఎక్స్), పలానో అధ్యక్షుడనో (వై) కాదని వివరించారు.


ఇవి కూడా చదవండి..

పాక్ రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.. అభివృద్ధి కంటే ఆయుధాలకే ప్రాధాన్యం..

ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 06:47 PM