Home » S Jaishankar
రష్యాపై వెస్ట్ దేశాల ఆంక్షలు విధించినప్పుడు ఇండియా ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, విభేదాలు యుద్ధంతో పరిష్కారం కావని తాము నమ్ముతామని జైశంకర్ చెప్పారు.
ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తూ, ఎవరైతే పెంచి పోషిస్తున్నారో, ఉగ్రవాద సేవలను వినియోగించుకుంటున్నారో వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరోక్షంగా పాక్ ఉగ్రవాదాన్ని జైశంకర్ ఎండగట్టారు.
ఆపరేషన్ సిందూర్తో పాక్పై దాడికి ముందే ఆ దేశానికి సమాచారం ఇవ్వడం నేరమని, భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు.
అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు చాలా కీలకమని, అయితే ఇందువల్ల ఒనగూరే ప్రయోజనాలను చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలని ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ అన్నారు.
భారత్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండు వంతుల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 70 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారని ఎస్,జైసంకర్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రెంప్ గెలిచిన తరువాత జైశంకర్ యూఎస్లో జరుపనున్న తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.
బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై జైశంకర్ లోక్సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైంశకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి కాన్బెర్రాలో మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఎండగట్టారు.
బ్రిస్బేన్ లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, 2020 జూన్లో గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం తలెత్తిన ప్రతిష్ఠంభన తొలగించడంలో ఇరుదేశాలు కొంత పురోగతి సాధించినట్టు చెప్పారు
చైనాతో చర్చల్లో పురోగతికి సైన్యం, దౌత్య బృందాల కృషి కారణమని జైశంకర్ అన్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందంలో భాగంగా దెప్సాంగ్, దమ్చోక్లో బలగాల ఉపసంహరణ మొదలైందన్నారు. త్వరలోనే ఆ ప్రకియ పూర్తవుతుందని చెప్పారు.