Writer Salman Rushdie Case: రచయిత సల్మాన్ రష్దీని గుడ్డివానిగా చేసిన కేసులో తుది తీర్పు
ABN , Publish Date - May 16 , 2025 | 10:10 PM
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అతి క్రూరంగా దాడి చేసినందుకు 27 ఏళ్ల హదీ మాటర్కు 25ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది ఆరంభంలో హదీ మాటర్ పై నమోదైన హత్యాయత్నం, దాడి

Writer Salman Rushdie Case: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అతి క్రూరంగా దాడి చేసినందుకు 27 ఏళ్ల హదీ మాటర్కు 25ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది ఆరంభంలో హదీ మాటర్ పై నమోదైన హత్యాయత్నం, దాడి కేసులో ఇప్పుడు దోషిగా నిర్ధారించబడ్డాడు. ఇంత చేసినా అతనిలో పరిణతి, పశ్చాత్తాపం కొంచెమైనా రాకపోవడం ఆశ్చర్యకరం. శిక్ష విధించే ముందు, అతను కోర్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. రష్దీకి వాక్ స్వాతంత్య్రం పట్ల ఉన్న అభిప్రాయాలను విమర్శిస్తూ.. బాధిత రచయితను కపటుడిగా హదీ మాటర్ అభివర్ణించాడు.
"సల్మాన్ రష్దీ ఇతరులను అగౌరవ పరచాలనుకుంటున్నాడు" అంటూ తెల్లటి చారల జైలు దుస్తులు ధరించి, చేతికి సంకెళ్లు ధరించి ఉన్న మటర్ కోర్టులో వ్యాఖ్యానించాడు. "అతను రౌడీగా ఉండాలనుకుంటున్నాడు, అతను ఇతరులను బెదిరించాలనుకుంటున్నాడు. నేను దానితో ఏకీభవించను." అని చెప్పుకొచ్చాడు.
ఈ కేసు తుది విచారణకు 77ఏళ్ల రచయిత అయిన రష్దీ కోర్టుకు హాజరుకాలేదు. కాని అతని ప్రకటనను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసు విచారణ సమయంలో, రష్దీ కీలక సాక్షిగా వ్యవహరించారు. తాను వేదిక మీద భద్రత గురించి ప్రసంగిస్తున్నప్పుడు ముసుగు ధరించిన వ్యక్తి తన తల, శరీరంపై పదేపదే పొడిచినప్పుడు తనకు చనిపోతున్నాననే ఫీలింగ్ కలిగిందని అప్పటి ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు రష్దీ.
ఇక, ఈ కేసులో రష్దీపై హత్యాయత్నానికి పాల్పడినందుకు మటర్కు గరిష్టంగా 25 సంవత్సరాల శిక్ష విధించారు. రష్దీతో పాటు వేదికపై ఉన్న మరో వ్యక్తిని గాయపరిచినందుకు ఏడేళ్ల శిక్ష విధించారు. అమెరికా న్యూయార్క్ స్టేట్ లోని చౌటౌక్వా కౌంటీ జిల్లా న్యాయమూర్తి జాసన్ ష్మిత్ ఈ మేరకు తుది తీర్పునిచ్చారు. ఇద్దరు బాధితులు ఒకే ఘటనలో గాయపడినందున శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని న్యాయమూర్తి చెప్పారు.
అయితే, పబ్లిక్ డిఫెండర్ నథానియల్ బరోన్.. మాటర్ క్లీన్ క్రిమినల్ రికార్డ్ను దృష్టిలో ఉంచుకుని 25ఏళ్ల శిక్ష కాకుండా, 12 సంవత్సరాలకు పరిమితం చేయాలని కోరారు. అయితే, దీనికి జడ్జి అంగీకరించలేదు. ఇక, దాడి తర్వాత సల్మాన్ రష్దీ పెన్సిల్వేనియా ఆసుపత్రిలో 17 రోజులు, న్యూయార్క్ నగర పునరావాస కేంద్రంలో మూడు వారాలకు పైగా గడిపారు. మిడ్నైట్స్ చిల్డ్రన్, ది మూర్స్ లాస్ట్ సై, విక్టరీ సిటీ వంటి ప్రముఖ రచనలు చేశారు. రష్దీ తన 2024 మెమొరీస్ అనే పుస్తకంలో తనపై జరిగిన దాడి గురించి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
రాత్రిపూట స్నానం చేసే అలవాటుందా?