Bangladesh Currency: బంగ్లా కొత్త కరెన్సీపై జాతిపిత స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 09:02 PM
కొత్త సిరీస్, కొత్త డిజైన్తో తీసుకువచ్చిన ఈ నోట్లపై మనుషులు చిత్రాలు ఉండవని, ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుసేన్ ఖాన్ చెప్పారు.

ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh)లో జూన్ 1వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీ మొదలైంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా డిజైన్ మార్పుతో కొత్త నోట్లను విడుదల చేశారు. మాజీ ప్రధాని, బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్ స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల ఫోటోలను ఈ నోట్లపై ముద్రించారు.
దీనిపై బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుసేన్ ఖాన్ మాట్లాడుతూ, కొత్త సిరీస్, కొత్త డిజైన్తో తీసుకువచ్చిన ఈ నోట్లపై మనుషులు చిత్రాలు ఉండవని, ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయని చెప్పారు. హిందూ, బౌద్ధ ఆలయాలు, జైనుల్ అబేదిన్ ఆర్ట్ వర్క్, 1971 లిబరేషన్ వార్లో అమరుల స్మారకం వంటివి ఉంటాయని తెలిపారు.
మూడు డినామినేషన్లతో రూ.1,000, రూ.50, రూ.20 నోట్లను తొలుత విడుదల చేశారు. కొత్త నోట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం జారీ చేసిందని, ఆ తర్వాత దేశంలోని బ్యాంకు బ్రాంచీల నుంచి నోట్లు జారీ చేస్తారని ఆరిఫ్ హుసేన్ ఖాన్ వివరించారు. ఇతర డినామినేషన్ల నోట్లు దశల వారిగా విడుదలవుతాయని చెప్పారు.
గతంలోనూ మార్పులు..
బంగ్లేదేశ్ కరెన్సీలో మార్పులు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. పాక్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందినప్పుడు 1972లో కరెన్సీ మార్పు జరిగింది. దేశ మ్యాప్ను ఆ నోట్లపై ముద్రించారు. ఆ తర్వాత అవామీ లీగ్ నేత షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోతో కరెన్సీ నోట్లు తెచ్చారు. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ హయాంలోనూ చారిత్రక, ఆర్కియాలజికల్ ప్రదేశాలను నోట్లపై ముద్రించారు.
ఇవి కూడా చదవండి..
ఊహించని దాడి.. ఏకంగా 40 యుద్ధ విమానాలు ధ్వంసం!
పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హసీనాపై అధికారిక అభియోగాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి