Health Tips: పాలు.. పండ్లు కలిపి తింటున్నారా.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:54 AM
పాలలో ప్రోటీన్, కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మరోవైపు పండ్లలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు, పండ్లు రెండూ ఆరోగ్యానికి మంచివే. పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు ఉంటాయి. అలాగే పండ్లలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్నాయి. కానీ ఈ రెండింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణ సమస్యలు
పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ పాలు జీర్ణం కావడానికి టైం పడుతుంది. ఈ రెండూ కలిపి తింటే, జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం కలగొచ్చు. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
విష పదార్థాలు
ఆయుర్వేదం ప్రకారం, పుల్లని పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీలు వంటివి) పాలతో కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో విష పదార్థాలుగా మారుతాయి. దీని వలన అలసటగా అనిపించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
చర్మ సమస్యలు
పాలు పండ్లూ కలిపి తినడం వల్ల జీర్ణం సరిగా కాకపోతే, ముఖంపై మొటిమలు, దద్దుర్లు, చర్మం ఉప్పగా మారటం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, వీటిని ఎప్పుడూ కలిపి తినకూడదు.
ఏం చేయాలి?
పాలు, పండ్లను వేర్వేరుగా తినడం మంచిది. మధ్యలో కనీసం 30 నిమిషాల గ్యాప్ ఉండాలి.
కలిపి తినాలంటే మామిడి లేదా అరటిపండ్లతో పాలను తీసుకోవచ్చు.
పాలను బాగా మరిగించి, చల్లబర్చిన తర్వాత తీసుకుంటే మంచిది.
పాలూ, పండ్లూ ఆరోగ్యానికి మంచివే కానీ కలిపి తినేటప్పుడు జాగ్రత్త అవసరం.
Also Read:
పాలను ఇలా మరిగిస్తే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు..
రాత్రి డిన్నర్ ఎన్ని గంటలకు చేయాలో తెలుసా
For More Health News