Diabetes: డయాబెటిస్తో బాధపడుతున్నారా.. ఈ 6 పానీయాలను అస్సలు తాగకండి..
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:01 PM
ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకు అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ సమస్య ఉన్నవారు కొన్ని పానీయాలను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో జీవనశైలి మారిపోవడం వల్ల చాలా మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనది డయాబెటిస్. చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మధుమేహం ఒకసారి వస్తే, అది శరీరాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఇలాంటి వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని పానీయాలు నివారించాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యంగా కనిపించవచ్చు కానీ డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం. కాబట్టి, ఈ 6 పానీయాలను అస్సులు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తీపిగా ఉన్న టీ
రోజూ తాగే టీలో ఎక్కువ చక్కెర కలిపితే అది మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది. పైగా టీలో ఉండే కెఫిన్ కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, హెర్బల్ టీను మాత్రమే తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్
మధుమేహం ఉన్నవారు కొన్నిసార్లు మద్యం అప్పుడప్పుడు తాగితే ఏం అవుతుందులే అని అనుకుంటారు. కానీ మద్యంలో చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. తరచుగా తాగితే కాలేయం బలహీనమవుతుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణను దెబ్బతీసి డయాబెటిస్ రిస్క్ను పెంచుతుంది. కాబట్టి, ఆల్కహాల్ పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచిది కాదు. సహజ శక్తి కావాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
సోడా
డయాబెటిస్ ఉన్న వారికి సోడా ప్రమాదకరం. ఎందుకంటే ఇందులో చక్కెర ఎక్కువగా ఉండేలా తయారు చేస్తారు. రోజూ సోడా తాగితే డయాబెటిస్ పెరిగే ప్రమాదం రెట్టింపు అవుతుంది. దానికంటే కొబ్బరినీరు, తాజా నిమ్మరసం తాగడం మంచిది.
తీపిగా ఉన్న కాఫీ
విప్డ్ క్రీమ్, స్వీట్ సిరప్ వేసిన కాఫీలు బయట స్టోర్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి రుచిగా ఉంటాయి కానీ ఎక్కువగా తాగితే మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు వస్తాయి. మంచి అలవాటు కోసం, తక్కువ చక్కెర కాఫీని తీసుకోండి.
పండ్ల రసాలు
తాజా పండ్ల రసాలు ఆరోగ్యంగా అనిపించవచ్చు కానీ.. వీటిలో ఫైబర్ తక్కువగా, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. కాబట్టి పండ్ల రసం కంటే నేరుగా తినడం మంచిది.
డయాబెటిస్ ఉన్నవారు ఏదైనా తాగే ముందు ఆలోచించాలి. ఆరోగ్యంగా అనిపించిన, తీపిగా ఉండే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవాలి. సరైన జీవనశైలి, సరైన ఆహారం మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఉదయాన్నే ఇవి తింటున్నారా.. జాగ్రత్త..
పాలక్ పనీర్ కలిపి తింటున్నారా.. ఇక అంతే..
For More Health News