Tax Free State: దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా నో ప్రాబ్లమ్..
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:08 PM
దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల పన్నుల భారం మోస్తుంటే, మరో పక్క సిక్కింలో మాత్రం అక్కడి పౌరులకు ఎలాంటి పన్ను ఉండదు. జాబ్, వ్యాపారం సహా ఏ విధంగా ఆదాయం పొందినా కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు (Tax Free State). అయితే ఎందుకు చెల్లించరనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మన దేశంలో అర్హతను బట్టి ఆదాయపు పన్ను చెల్లించడం ప్రతి పౌరుడికి తప్పనిసరిగా మారింది. కానీ భారతదేశంలోని ఓ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి పన్ను చెల్లింపులు ఉండవు. అవును మీరు చదివింది నిజమే. అక్కడి పౌరులు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు (Tax Free State). ప్రస్తుతం సిక్కిం(Sikkim)లో ఈ విధానాన్ని పాటిస్తున్నారు. అర్హులైన స్థానికులు ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించరు. ఉద్యోగం లేదా వ్యాపారం, పెట్టుబడుల ద్వారా ఆదాయం పొందినా కూడా వారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
చట్టపరమైన ఆధారం
అయితే ఈ ప్రయోజనం సరదాగా వచ్చింది మాత్రం కాదు. దీనిని భారత రాజ్యాంగం Article 371(F), Income Tax Actలోని Section 10(26AAA) ప్రకారం అమలు చేస్తున్నారు. ఇవి సిక్కింకు ప్రత్యేక హోదాను కల్పిస్తున్నాయి. 1975లో సిక్కిం భారతదేశంలో విలీనమైనప్పుడు, కొన్ని స్వతంత్ర హక్కులను కొనసాగించేందుకు ప్రత్యేక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా సిక్కింకు ట్యాక్స్ మినహాయింపు హక్కు చట్టబద్ధంగా అమలులోకి వచ్చింది.
ఈ చట్టం ప్రకారం
Income Tax Actలోని Section 10(26AAA) ప్రకారం Sikkimese అని గుర్తింపు పొందిన వ్యక్తులు ఆదాయం ఏ విధంగా పొందినా కూడా పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, షేర్ల లాభాలు అన్నింటిపై కూడా పన్ను ఉండకపోవడం విశేషం. పన్ను మినహాయింపు పొందాలంటే Sikkim 1961 చట్టం ప్రకారం సిక్కింలో గుర్తింపు పొందిన వ్యక్తులై ఉండాలి. అంటే సిక్కిం భారత్లో విలీనం అయిన 1975కి ముందు వారి పేరు అధికారికంగా నమోదై ఉండాలి. అలాంటి వారికి మాత్రం పన్ను మినహాయింపులు లభిస్తాయి.
చట్టం ద్వారా భద్రత
ఈ హక్కు కేవలం తాత్కాలికం మాత్రమే కాదు. ఇది రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కు. దీనిలో మార్పులు చేయాలంటే మాత్రం తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే.
పన్ను లేకపోవడం వల్ల లాభాలు
అర్హులైన సిక్కింకు నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
ఆదాయంలో పూర్తిగా స్వేచ్ఛ
ఎక్కువ పొదుపు చేసుకోవచ్చు
పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువ
పన్ను లేకపోవడం వల్ల వ్యాపారాలు, స్టార్టప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అభివృద్ధి చెందుతుంది. పన్ను భారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది వ్యాపారవేత్తలు సిక్కింలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధిని తీసుకొస్తుంది.
ఇవీ చదవండి:
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..