Financial Loss: నష్టాల్లోకి జారుకున్న సిగాచి
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:37 AM
ఇటీవల పాశమైలారం ప్లాంటులో జరిగిన ప్రమాదం సిగాచీ ఇండస్ట్రీలకు..

హైదరాబాద్: ఇటీవల పాశమైలారం ప్లాంటులో జరిగిన ప్రమాదం సిగాచీ ఇండస్ట్రీలకు పెద్ద నష్టాలే మిగిల్చింది. దీంతో తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.128.2 కోట్ల ఆదాయంపై రూ.101 కోట్ల నష్టాలను చవి చూసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.95.7 కోట్ల ఆదాయంపై రూ.12.8 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఈ ఏడాది డిసెంబరు త్రైమాసికం నుంచి కంపెనీ ఆర్థిక పరిస్థితి గాడిలో పడే అవకాశం ఉందని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. ప్రమాదంలో దెబ్బతిన్న పాశమైలారం ప్లాంటును దశల వారీగా పునరుద్ధరించాలని కంపెనీ యోచిస్తోంది.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News