SBI: ఎఫ్డీ ఆశలకు బ్రేక్.. రెండోసారి కోత పెట్టిన ఎస్బీఐ
ABN , Publish Date - May 19 , 2025 | 12:15 PM
దేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన SBI తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో బ్యాంక్ ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది కస్టమర్లకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలో SBI అన్ని కాలపరిమితి గల FD రేట్లను 20 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. SBI వెబ్సైట్ ప్రకారం ఈ వడ్డీ రేట్ల కోత చివరిసారిగా ఏప్రిల్ 15, 2025న జరిగింది. అంటే, కేవలం ఒక నెల వ్యవధిలోనే బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం.
తగ్గింపు కారణంగా..
ఈ వడ్డీ రేట్ల తగ్గింపుతో SBI FDలో పెట్టుబడులు పెట్టే కస్టమర్లు ఇప్పుడు తక్కువ వడ్డీని పొందనున్నారు. ఉదాహరణకు, 1 నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి గల FDలపై వడ్డీ రేట్లు 6.75% నుంచి 6.55%కి తగ్గాయి. అలాగే, 2 నుంచి 3 సంవత్సరాల FDలపై వడ్డీ రేట్లు 6.75% నుంచి 6.55%కి తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు అందించే ప్రత్యేక రేట్లు కూడా ఈ కోతకు గురైంది. ఇది వీరి ఆర్థిక భద్రతను ప్రభావితం చేస్తుంది. ఈ వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా SBI కస్టమర్లు ఇతర బ్యాంకుల FDలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఇంకా మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ పరిస్థితి, బ్యాంకింగ్ రంగంలో పోటీని మరింత పెంచుతుంది.
మీ డిపాజిట్లు చెక్ చేశారా..
SBI ఈ నిర్ణయం ఆర్థిక మార్కెట్లలో మార్పులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధానాలు, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి తీసుకుంటుంది. RBI వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు, బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఆ క్రమంలో ఇది కస్టమర్లకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు తమ పెట్టుబడులను పునఃసమీక్షించుకోవాలి. ఈ సమయంలో ఇతర బ్యాంకుల FDలను పరిశీలించడం, ఆర్థిక నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. డిపాజిట్లను ఏ బ్యాంకులో పెట్టుబడులు చేయాలి, ఎక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయనేది తెలుసుకోవడం మంచిది. వడ్డీ రేట్లు మారిన వెంటనే నిర్ణయం తీసుకుంటే నష్ట భారం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మీరు ఆర్థికంగా డిపాజిట్లపై వడ్డీ రూపంలో నష్టపోవాల్సి వస్తుంది.
ఇవీ చదవండి:
Heavy Rain: భారీ వర్షం, ఆఫీసులు బంద్.. జేసీబీలో ఎమ్మెల్యే పర్యటన..
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి