Share News

India GDP: భారత జీడీపీ అంచనాలను తగ్గించిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ.. కారణమిదే

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:56 PM

2025లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనలిటిక్స్ 6.1 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆర్థిక రంగంలో కీలక మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అంచనాను తాజాగా తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

 India GDP: భారత జీడీపీ అంచనాలను తగ్గించిన గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ.. కారణమిదే
Moodys india GDP growth forecast

2025లో భారతదేశం జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనలిటిక్స్ 6.1 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో భారత ఆర్థిక రంగంలో కొన్ని కీలక మార్పులపై ఆసక్తి నెలకొంది. మార్చి 2025 బేస్‌లైన్‌లో భారత జీడీపీ వృద్ధిని 6.4 శాతంగా ప్రకటించిన మూడీస్ అనలిటిక్స్.. తాజాగా ఈ అంచనాను తగ్గించి 6.1 శాతంగా సవరించడం విశేషం. ఈ రేటింగ్ ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే పరస్పర సుంకాల (టారిఫ్స్) బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.


ప్రపంచ ఆర్థిక పరిణామాల సవాల్

ఈ క్రమంలో మూడీస్ అనలిటిక్స్ భారత జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే ముఖ్య కారణాలను సూచించింది. అమెరికా ప్రభుత్వం 75 దేశాలపై దిగుమతి సుంకాలను విధించడంతో, భారతదేశం కూడా ఈ ప్రభావంతో ఇబ్బంది పడుతోంది. అమెరికా చక్కెర దిగుమతులపై 125 శాతం సుంకం పెంచింది. ఇది దేశీయ వాణిజ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. దీంతోపాటు 26 శాతం అదనపు సుంకాన్ని 90 రోజుల పాటు నిలిపివేసినప్పటికీ, సుంకాలు భారతదేశ ఉత్పత్తులకు, వ్యాపారాలకు ప్రతిఘటనలను సృష్టించానున్నాయని ప్రస్తావించింది.


భారత వ్యాపార రంగం

మూడీస్ అంచనా ప్రకారం, ముఖ్యంగా రత్నాలు, ఆభరణాలు, వైద్య పరికరాలు, వస్త్ర పరిశ్రమల వ్యాపారం ఈ సుంకాల ప్రభావంతో తగ్గే అవకాశం ఉంది. ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలు కాగా, వాటిపై భారంగా ప్రభావం పడటం, దేశీయ వృద్ధి రేటును తగ్గించే ప్రమాదం ఉంది. ఆ క్రమంలో భారతీయ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను తగ్గించడానికి సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మూడీస్ అనలిటిక్స్ ఈ సంవత్సరం చివరి నాటికి 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపు అంచనా వేస్తుంది. తద్వారా పాలసీ రేటు 5.75 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయం, మరింత పన్ను ప్రోత్సాహకాలతో కలిపి, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహాయపడుతుంది.


వ్యాపార ప్రపంచంలోని అనిశ్చితి

అనిశ్చితి, ఆర్థిక మార్కెట్ సంక్షోభం మధ్య భారతదేశ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో గృహ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం మరింత చూపించనుంది. మూడీస్ ప్రకారం, ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ పరిస్థితులు, వాణిజ్య ఖర్చుల పెరుగుదల, సుంకాల ప్రభావం దేశీయ వ్యాపార సంక్షోభానికి దారి తీస్తాయని అంచనా వేసింది.


ముఖ్యమైన రంగాలు, ప్రభావం

ప్రపంచ వాణిజ్యం అనుకున్నట్లుగా రాణించకపోవడం, పెరిగిన సుంకాల భారాన్ని అనుభవించడం, వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఆందోళకరంగా మారుతాయని అంచనా వేసింది. ఇది భారతదేశ వాణిజ్య రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదని తెలిపింది. దీనివల్ల భారతదేశం వాణిజ్య ఖర్చులు పెరుగుతాయని, అంతర్జాతీయ వాణిజ్య ఉత్పత్తుల ధరలు కూడా మారవచ్చని వెల్లడించింది.


తగ్గనున్న కొనుగోలు శక్తి

ఈ క్రమంలో ముఖ్యంగా మెటల్, వస్త్ర, రత్నాలు, ఆభరణాల రంగాలు, ఆర్థిక పతనానికి గురవుతాయని వెల్లడించింది. అమెరికా నుంచి వచ్చే సుంకాలు ఈ పరిశ్రమలపై మరింత ప్రభావం చూపుతాయంది. ఈ పరిశ్రమలు అధిక ప్రొడక్షన్ కోస్ట్‌లను ఎదుర్కొవడం వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుందని పేర్కొంది. అనిశ్చితి కారణంగా, ప్రపంచ ఆర్థిక మార్కెట్లు కూడా తీవ్రస్థాయిలో మార్పులు చెందుతాయి. ఆ క్రమంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయని మూడీస్ అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 10 , 2025 | 10:00 PM