Gold Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:29 AM
సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. కానీ ఈరోజు (Gold Rates Today June 9th 2025) ఉదయం నాటికి మాత్రం గత రేటుతో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఏ స్థాయికి చేరుకున్నాయనేది ఇక్కడ చూద్దాం.

దేశంలో సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీటి ధరలు పైపైకి చేరాయి. ఈ నేపథ్యంలో జూన్ 9, 2025న ఉదయం నాటికి మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు (Gold Rates Today June 9th 2025) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 10 తగ్గిపోయి రూ. 97,960 స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 89,790కు చేరింది.
ఇతర నగరాల్లో బంగారం ధరలు
ఢిల్లీ: 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 98,110, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,940
ముంబై: 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,960, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,790
చెన్నై: 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,960, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,790
బెంగళూరు: 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,960, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,790
విశాఖపట్నం: 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,960, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,790
వెండి ధరల పరిస్థితి
ఇక వెండి ధరలు విషయానికి వస్తే బంగారం ధరల మాదిరిగానే ఇవి కూడా స్వల్పంగా తగ్గాయి. జూన్ 9, 2025న హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 117,900గా నమోదైంది. ఇది గత రోజుతో పోలిస్తే రూ.100 తగ్గింది. ఇదే సమయంలో ఇతర నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 106,900
విశాఖపట్నంలో కేజీ వెండి రేటు రూ. 117,900
ముంబైలో కేజీ వెండి రేటు రూ. 106,900
చెన్నైలో కిలో వెండి ధర రూ. 111,900
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 106,900
గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, యూఎస్ డాలర్ మారకం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వంటి అంశాలు ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగినప్పుడు భారతదేశంలో కూడా వీటి ధరలు పెరుగుతాయి. ఆర్థిక అస్థిరత సమయంలో బంగారాన్ని ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తిగా పరిగణిస్తారు. వెండికి బంగారం తర్వాత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీటి ధరలు బంగారం కంటే తక్కువగా ఉండటం వల్ల ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది. వీటి ధరలు ఆయా నగరాలను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ఓసారి ధరలను తెలుసుకోవడం మంచిది.
ఇవీ చదవండి:
ఐఎండీ అలర్ట్.. జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..