Gold Rates Today: బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే..
ABN , Publish Date - May 23 , 2025 | 06:28 AM
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఈ క్రమంలో నేడు (gold rates today may 23rd 2025) కూడా వీటి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం పదండి.

భారతదేశంలో బంగారం, వెండి ధరలు (gold rates today may 23rd 2025) ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పుంజుకున్నాయి. అమెరికన్ డాలర్, యూఎస్ ట్రెజరీ దిగుబడులు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణించి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తున్నారు. కొన్ని వారాల క్రితం భారీగా తగ్గిన ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం పట్ల సామాన్య ప్రజలు కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈరోజు ధరలు ఇలా..
ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం మే 23, 2025న (gold rates today) ఉదయం 6.35 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 490 పెరిగి రూ. 97,920కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.450 వృద్ధి చెంది రూ. 89,760కి చేరింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 98,070కి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,910కు చేరుకుంది.
వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలు కూడా ఈ ధోరణిని కొనసాగించాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర ఢిల్లీలో 100 రూపాయలు పెరిగి రూ. 1,01,000కి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.112,100కు చేరింది. ఇక చెన్నై, కేరళ ప్రాంతాల్లో కూడా సిల్వర్ రేట్లు రూ.112,100గా ఉన్నాయి. నాసిక్, నోయిడా, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు రూ. 1,01,000 స్థాయికి చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.7% పెరిగి ఔన్స్కు $3,336.43కు చేరుకుంది. ఇది మే 9 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.7% పెరిగి $3,337.60కి చేరుకున్నాయి. స్పాట్ సిల్వర్ ధర దాదాపు 1% పెరిగి ఔన్స్కు $33.66కి చేరింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు నాలుగో రోజు బలపడ్డాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికాలో ఆర్థిక లోటు ఆందోళనలు సహా ఇండియాలో పలు అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. ఈ సంవత్సరం బంగారం ధర 26% పెరగడం విశేషం.
ఇవీ చదవండి:
పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..
విమానంపై వడగళ్ల వాన.. 227 మంది ఉన్న ఫ్లైట్కు తప్పిన ఘోర ప్రమాదం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి