Share News

Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు

ABN , Publish Date - May 31 , 2025 | 06:37 AM

దేశంలో పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. నిన్న తగ్గిన పసిడి ధరలు, ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ వీటి ధరలు పెరగడం పట్ల సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు ఉదయం నాటికి ఏ మేరకు పెరిగాయో ఇక్కడ చూద్దాం.

Gold Rates Today: సామాన్యులకు షాకింగ్.. పెరిగిన గోల్డ్, తగ్గిన వెండి ధరలు
Gold Rates Today may 31st 2025

దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న స్వల్పంగా తగ్గిన వీటి ధరలు, నేటి ఉదయం నాటికి మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు (gold rates today may 31st 2025) ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ.140 పెరిగి రూ.97,320కి చేరింది. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 89,210కు చేరుకుంది. మరోవైపు ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.290 పెరిగిపోయి రూ.97,470కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.89,360కు చేరుకుంది.


నేటి వెండి ధరలు

ఇక నేటి వెండి ధరల విషయానికి వస్తే ఇవి పసిడికి వ్యతిరేకంగా మారాయి. అంటే గోల్డ్ రేట్లు పెరిగితే ఇవి మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.99,800 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ.110,800గా ఉంది. బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, సూరత్, పాట్నా, అయోధ్య వంటి ప్రాంతాల్లో కూడా కిలో వెండి ధర రూ.99,800గా ఉంది. పాండిచ్చేరి, చెన్నై, మధురై, త్రివేండ్రం ప్రాంతాల్లో మాత్రం వెండి రేట్లు రూ.110,800 స్థాయిలో ఉన్నాయి.


అంతర్జాతీయ ధరలు

రాయిటర్స్ నివేదిక ప్రకారం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు $3,300.59 వద్ద 0.5% తగ్గింది. ఈ వారంలో బంగారం ధర 1.7% తగ్గిపోయింది. ఇదే సమయంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5% తగ్గి $3,298.30 స్థాయిలో ఉంది. స్పాట్ వెండి ధర 0.8% తగ్గి ఔన్స్‌కు $33.07 వద్ద ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ టారిఫ్‌ల కారణంగా డాలర్ విలువ మార్పులు చెందుతోంది. తాజాగా ట్రంప్ చైనా విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్‎పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.


బంగారం స్వచ్ఛమైనదా ఎలా తెలుసుకోవాలి

బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో బంగారం స్వచ్ఛతను ISO హాల్‌మార్క్ గుర్తుల ద్వారా గుర్తిస్తారు. ఈ గుర్తులు బంగారం నాణ్యతను తెలియజేస్తాయి. ఉదాహరణకు, 24 క్యారెట్ బంగారం 99.9% స్వచ్ఛమైనదని (999 హాల్‌మార్క్), 22 క్యారెట్‌లో 91.6% బంగారం, మిగిలినవి రాగి, వెండి వంటి లోహాలు (916 హాల్‌మార్క్).

ఇలా 23 క్యారెట్ అని (958), 21 క్యారెట్ (875), 18 క్యారెట్ (750) గుర్తులతో సూచిస్తారు. 24 క్యారెట్ బంగారం అత్యంత స్వచ్ఛమైనది, కానీ మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీకి తక్కువగా ఉపయోగిస్తారు. అందుకే 22 లేదా 18 క్యారెట్ బంగారం ఆభరణాలకు ఎక్కువగా ఎంచుకుంటారు. బంగారం కొనే ముందు హాల్‌మార్క్ గుర్తు ఉందో లేదో తప్పకుండా చెక్ చేయాలి. ఒకవేళ హాల్‌మార్క్ లేకపోతే, నమ్మకమైన జ్యూయలరీ షాప్‌లో స్వచ్ఛతను పరీక్షించుకోవాలి.


ఇవీ చదవండి:

నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 07:42 AM