Share News

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

ABN , Publish Date - May 27 , 2025 | 06:36 AM

దేశంలో ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ ఇదే సమయంలో వెండి రేట్లు పుంజుకోవడం విశేషం. అయితే ఏ మేరకు తగ్గాయి, ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Gold Rates Today may 27th 2025

దేశంలో బంగారం (gold rates today), వెండి ధరలు మార్కెట్‌లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. 24 క్యారెట్ పసిడి ధర సగటున 95 వేల స్థాయి నుంచి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మే 27, 2025న ఉదయం నాటికి బంగారం రేటు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు (gold rates today may 27th 2025) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 400 తగ్గిపోయి రూ. 97,630కి చేరింది. 22 క్యారెట్ పసిడి ధర కూడా 10 గ్రాములకు రూ. 400 తగ్గి రూ. 89,500కి చేరుకుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాముల రూ. 97,780 స్థాయికి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,640గా ఉంది.


ఈ బంగారం ధరల్లో కూడా..

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా బంగారం ధరలు రూ. 700 తగ్గి 10 గ్రాములకు రూ. 95,650 వద్ద స్థిరపడ్డాయి. జూన్ 2025 గడువుతో ఉన్న MCX బంగారం ధర రూ. 486 తగ్గి రూ. 95,935కి చేరింది. ఇది 0.5% పతనాన్ని సూచిస్తుంది. ఈ క్రమంలో వ్యాపారంలో బంగారం ధర రూ. 95,507 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ తగ్గుదలకు కారణం కామెక్స్ (COMEX) బంగారం ధరల్లో బలహీనత, రూపాయి విలువలో అస్థిరత అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు.


వెండి ధరల్లో పెరుగుదల

బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరగడం విశేషం. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 1,00,100 మార్కును తాకింది. ఇక హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడలో కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ.111,100 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో చెన్నై, కేరళ, భువనేశ్వర్, త్రివేండ్రం ప్రాంతాల్లో వెండి ధరలు రూ.111,100గా ఉన్నాయి. వారణాసి, గోవా, నోయిడా, రాజ్ కోట్, మైసూర్, సూరత్, ముంబై, పాట్నా ప్రాంతాల్లో కేజీ వెండి రేట్లు రూ. 100100గా కలవు. MCXలో వెండి ధరలు రూ. 42 లేదా 0.04% పెరిగి కిలోకు రూ. 98,045 వద్ద ముగిశాయి.


ధరల పతనానికి కారణాలు

బంగారం ధరల తగ్గుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లోని కొన్ని అనేక అంశాలు కారణమయ్యాయి. అమెరికా యూరోపియన్ యూనియన్ (EU) వస్తువులపై సుంకాల అమలును జూన్ 1 నుంచి జూలై 6 వరకు వాయిదా వేయడంతో ఆయా దేశాల్లో ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గాయి. దీంతో బంగారంపై ఆకర్షణ క్రమంగా తగ్గిపోయింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపిల్ ఇంక్‌కు ఐఫోన్‌లను అమెరికాలో తయారు చేయకపోతే 25% సుంకాలు విధిస్తామని హెచ్చరించడం కూడా మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది. గత వారం బంగారం ధరలు దాదాపు 5% పెరిగాయి. ఇది సుంకాల అనిశ్చితి, అమెరికా ఆందోళనల వల్ల సంభవించింది.


ఇవీ చదవండి:

టీసీఎస్‌ ఏఐ.క్లౌడ్‌ వ్యాపార విభజన

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 12:57 PM