Today Gold Rate: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 07:18 AM
Today Gold Rate: పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరువలో ఉంది.

Business News: పసిడికి (Gold) మార్కెట్లో (Market) ఎల్లప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరువలో ఉంది. జూన్ నెల ప్రారంభంలోనే బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా భారతదేశంలో 24 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 88 పెరిగి రూ. 9,928గా ఉండగా, 22 క్యారెట్లు బంగారం గ్రాముకు రూ. 80 పెరిగి రూ. 9,100గా ఉంది. అలాగే 18 క్యారెట్లు బంగారం కూడా రూ. 66 పెరిగి రూ. 7,446గా ఉంది.
భారతదేశంలో బంగారం ధరలు..
ప్రస్తుతం 100 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.9,92,800 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,10,000.. 18 క్యారెట్లు రూ.7,44,600గా ఉంది.
హైదరాబాద్లో బంగారం ధరలు..
నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,280.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,000.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,460గా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 10 గ్రాముల బంగారం (24, 22, 18 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
ఢిల్లీ: రూ.99,430, రూ.91,150, రూ.74,580
ముంబై: రూ.98,280, రూ.91,000, రూ.74,460
కోల్కతా- రూ.98,280, రూ.91,000, రూ.74,460
చెన్నై- రూ.98,280, రూ.91,000, రూ.74,460
బెంగళూరు- రూ.98,280, రూ.91,000, రూ.74,460
కేరళ: రూ.98,280, రూ.91,000, రూ.74,460
పుణె- రూ.98,280, రూ.91,000, రూ.74,460
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారమే ముఖ్యంగా వెండి ధరలను నిర్ణయిస్తుంది. డిమాండ్ పెరిగితే బంగారం ధర కూడా పెరుగుతుంది, ఫలితంగా వెండి ధర కూడా పెరుగుతుంది. పరిశ్రమలు, వ్యాపారసంస్థలు.. వెండిని వివిధ వస్తువులు అనగా, కంప్యూటర్లు, టీవీలు, మెడల్స్, నాణేలు ఇంక నగల వంటి తమ ఉత్పత్తులు తయారుచేయటంలో వాడతాయి. ఈ పరిశ్రమలు దాదాపు ప్రతిరోజూ ఏవో ఒక కొత్త ఉత్పత్తులు ప్రారంభిస్తాయి, దానివల్ల వెండి డిమాండ్ పెరిగి, ధరలు కూడా పెరుగుతాయి. హైదరాబాద్లో కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 1,18,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,08,900కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,08,900 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,18,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,18,900 వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
For More AP News and Telugu News