Share News

Nimmala Ramanaidu: ఎక్కడా లేనివిధంగా వైసీపీ లిక్కర్‌ స్కాం

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:07 AM

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కాం దేశంలో మరెక్కడా జరగలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ డిస్టిలరీల స్కాంలో పోలిస్తే జగన్‌ లిక్కర్‌ స్కాం ఎవరెస్టు శిఖరాన్ని తాకుతుందన్నారు

Nimmala Ramanaidu: ఎక్కడా లేనివిధంగా వైసీపీ లిక్కర్‌ స్కాం

పాలకొల్లు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ స్కాం లాంటిది దేశంలో మరెక్కడా జరగలేదని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో ‘మన రైతు మన రామానాయుడు’ కార్యక్రమంలో భాగంగా.. శనివారం ఆయన రూ.కోటితో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ డిస్టిలరీల్లో జరిగిన లిక్కర్‌ స్కాంతో పోలిస్తే జగన్‌ లిక్కర్‌ స్కాం ఎవరెస్టు శిఖరాన్ని తాకుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలి లిక్కర్‌, సాండ్‌, మైన్స్‌, భూముల దోపిడీపైనే నాడు జగన్‌ దృష్టిపెట్టాడని విమర్శించారు. వైసీపీ నాయకుల పెరట్లో తయారు చేసిన నాసిరకం కల్తీ మద్యంతో లక్షలాదిమంది అనారోగ్యం పాలయ్యారని, వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు 9నెలల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని, ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్నారని రామానాయుడు చెప్పారు.


Also Read:

వీళ్లు వేడి నీళ్లు తాగకూడదు..

విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..

ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 27 , 2025 | 04:07 AM