Weather Updates: రేపు, ఎల్లుండి మండే ఎండలు.. ఉక్కపోత..
ABN , Publish Date - Jun 09 , 2025 | 07:35 PM
ఆంధ్రప్రదేశ్లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు ఎండలు మండిపోబోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ నివేదిక వెలువరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళ, బుధవారాల్లో రెండ్రోజులపాటు ఎండలు మండిపోబోతున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం నాడు గరిష్ఠంగా 41- 42.5°C వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక, బుధవారం నాడు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉక్కపోతతోపాటు గరిష్ఠంగా 40 - 41.5°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, మన్యం జిల్లా గంగన్న దొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో ఇవాళ(సోమవారం) 40.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News