Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి..
ABN , Publish Date - Jun 12 , 2025 | 08:14 AM
Parawada Pharma Accident: అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Anakapalli: పరవాడ (Parawada) జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ( Jawaharlal Nehru Pharma City) ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SS Pharmaceuticals Private Limited)లో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ (Gas Leak) కావడంతో ముగ్గురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అందులో ఇద్దరు కార్మికులు మృతి (Two Workers Dead) చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందినవారు పరిమి చంద్రశేఖర్, సరగడం కుమార్ మృతులుగా గుర్తించారు. బైడూ భైసాల్ అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
1. పరిమి చంద్రశేఖర్ గారు (సేఫ్టీ మేనేజర్ – తెలంగాణ)
2. సరగడం కుమార్ గారు (సేఫ్టీ ఆఫీసర్ – మునగపాక, అనకాపల్లి)
3. బైడూ భైసాల్ అనే హెల్పేర్ (బోడెన్, ఒడిశా)
అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. కంపెనీలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన ముగ్గురు కార్మికులు అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో కార్మికుడు షీలానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ మల్లికార్జునరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
For More AP News and Telugu News