Fishermens: ముగిసిన నిషేధ కాలం.. అర్ధరాత్రి నుంచి చేపల వేటకు
ABN , Publish Date - Jun 15 , 2025 | 08:09 AM
Fishing ban end: సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు.

Visakha: సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం (Central Government) విధించిన రెండు నెలల నిషేధ కాలం శనివారంతో ముగిసింది (Fishing ban end). దీంతో గత అర్ధరాత్రి (Midnight) నుంచి మత్స్యకారులు (Fishermens) వేటకు బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో చేపల వేట సాగించడానికి మత్స్యకారులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. వలలు, బోట్లు, ఇంజన్లకు మరమ్మతులు పూర్తి చేసుకుని బోట్లకు రంగులు వేశారు.
నిషేధ సమయంలో రెట్టింపు భృతి..
విశాఖ జిల్లాలో సముద్ర తీరం వెంబడి పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, ఎస్రాయవరం, పాయకరావుపేట మండలాలు వున్నాయి. ఆయా మండలాల్లోని పూడిమడక, బంగారమ్మపాలెం, రాజయ్యపేట, బోయపాలెం, రేవుపోలవరం, ముత్యాలమ్మపాలెం, వెంకటనగరం, రాజానగరం, కొత్తపట్నం, వాడ నర్సాపురం, పాల్మన్పేట, కొర్లయ్యపాలెం, డీఎల్పురం, గజపతినగరం, పెదతీనార్ల గ్రామాల్లో సముద్రంపై చేపల వేట సాగించే మత్స్యకారులు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకు సముద్రంలో చేపలు, రొయ్యలు, ఇతర సంపద వేటపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
గత ఏడాది జిల్లాలో 2,168 మంది మత్స్యకారులు చేపల వేట నిషేధ భృతికి అర్హులుగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది 2,400 మందిని అర్హులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.4.8 కోట్లు ఆయా మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రెండు నెలల క్రితమే జమ చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం రెట్టింపు భృతి ఇవ్వడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో
For More AP News and Telugu News