Varla Ramaiah: సిట్ విచారణతో వైసీపీ నేతలకు తడిసిపోతుంది..
ABN , Publish Date - May 19 , 2025 | 08:47 PM
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు భయపడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా అరెస్ట్ చేయాలన్నారు.

అమరావతి: సిట్ విచారణతో వైసీపీ నేతలకు తడిసిపోతుందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు పుంకాను పుంకాలు అబద్దాలు రాస్తున్నారన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన ఏ స్థాయి వ్యక్తులను కూడా చట్టం క్షమించదన్నారు. బంగారు కమోడ్ ఉపయోగించే వ్యక్తి కూడా చట్టానికి తలొగ్గి జైల్లో చిప్పకూడు తినక తప్పలేదన్నారు. లిక్కర్లో అవినీతిపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద తలలు కంగారుపడుతున్నాయి, భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అవినీతి చేయకపోతే, అవినీతి సొమ్ము భుజించకపోతే, అవినీతి సొమ్ము కొట్టేయకపోతే భయం ఎందుకు ? లిక్కర్ అవినీతిపై అంబటి, ఆ రాజమండ్రి గోడమీద పిల్లి తేలుకుట్టిన దొంగల్లా కిక్కుమనడంలేదు ఎందుకు? అని మండిపడ్డారు.
బంగారంపై కూడా విచారణ చేయాలి
వందకొట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కే అక్కడి సీఎం పెద్ద పెద్ద నేతలు అరెస్ట్ అయ్యారని, ఇక్కడ వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, సిట్ దర్యాప్తులో అన్ని బయటకు వస్తాయని తెలిపారు. 18 వేల కోట్లు దారి మళ్లినట్లు తెలుస్తుందన్నారు. కేంద్రం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే.. ఇక్కడ నగదు లావాదేవీలతో మద్యం అమ్మకాలు జరిపి దోచుకుంది వాస్తవం కాదా? రాజ్ కసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలాంటి అధికారులను అడ్డం పెట్టుకొని వేలకోట్లు కొట్టేయడం నిజం కాదా? సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా అరెస్ట్ చేయాలన్నారు. దుబాయి నుండి తెచ్చిన బంగారంపై కూడా మళ్లీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
చట్టానికి అతీతుడా?
సిట్ దుబాయికి వెళ్లి విచారణ మొదలు పెడితే మాకొద్దు ఈ రాజకీయం అని దోపిడీదారులు పారిపోతారన్నారు. ధనుంజయ్ రెడ్డికి సంబంధించిన ఓ మహిళ దుబాయి నుండి తరలించిన బంగారుపై దర్యాప్తు చేయాలన్నారు. జగన్ పాలనలో మన రాష్ట్రంలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని వివరించారు. లిక్కర్ లో రూ.3,200 కోట్ల అవినీతి కేసుపై కూటమి ప్రభుత్వం సిట్ వేసి దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద తలలు కంగారుపడుతున్నాయన్నారు. ఐపీఎస్ అయితే పీఎస్ ఆర్ చట్టానికి అతీతుడా? ప్రజా సొమ్ములు దిగమింగడమే కాక నీతులు మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, పుష్ప సినిమాలకు వచ్చిన డబ్బుల కంటే మధ్యం అవినీతిలో వచ్చిన డబ్బే ఎక్కువ అని చెప్పుకొచ్చారు.
Also Read:
Pawan Kalyan: వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ..
YouTuber Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ వ్లాగ్.. ఇది అస్సలు ఊహించలేదు..
Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు