Share News

West Godavari Food Supply: టెండర్‌ నియమావళినే అనుసరించాం

ABN , Publish Date - May 27 , 2025 | 05:04 AM

పశ్చిమగోదావరి పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ టి. శివరామప్రసాద్‌ టెండర్‌ నియమావళిని కఠినంగా అనుసరించి ఏడు ఏజెన్సీలను బియ్యం సరఫరాకు ఎంపికించినట్టు తెలిపారు. బియ్యం రవాణా, ప్యాకింగ్‌ పనులకు అనుభవజ్ఞులైన ఏజెన్సీలకే బాధ్యతలు ఇచ్చారు అని వివరణ ఇచ్చారు.

West Godavari Food Supply: టెండర్‌ నియమావళినే అనుసరించాం

  • పౌర సరఫరాల శాఖ మేనేజర్‌

భీమవరం, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలలకు, హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరాలో టెండర్‌ నియామవళిని అనుసరించే ఏడు ఏజెన్సీలను ఖరారు చేశామని పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ టి.శివరామప్రసాద్‌ తెలిపారు. ‘టెండర్లు లేకుండానే బియ్యం రవాణా’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై సోమవారం ఆయన వివరణ ఇచ్చారు. ప్యాకింగ్‌తోపాటు, రవాణాకు టెండర్‌ నియమావళిని అనుసరించి ఏజెన్సీలను ఖరారు చేశామన్నారు. ప్యాకింగ్‌ అనుభవం ఉన్న వారికే ఈ బాధ్యతలను అప్పగించామన్నారు.

Updated Date - May 27 , 2025 | 05:06 AM