TDP politburo: టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం తీసుకున్న కీలక నిర్ణయాలు
ABN , Publish Date - May 14 , 2025 | 07:59 PM
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న నారా లోకేష్ ప్రతిపాదనకు

TDP politburo: అమరావతి: ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సాయంత్రం అమరావతిలో జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి చెందిన ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ప్రతిపాదనకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో ఓకే చెప్పింది. మూడు పర్యాయాలు ఆరు ఏళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు. మూడు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షులుగా చేసిన వారికి ఆ పైస్థాయి పదవి లేదా ఇతర సమాంతర పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
నెలకో సంక్షేమ పథకం అమలు చేసేలా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం చేసింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఈ నెల 27న చంద్రబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావం గా 16, 17, 18 తేదీల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిoచాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అన్ని నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ సభ్యత్వం ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు భీమా త్వరగా అందేలా చర్యలకు నిర్ణయం చేశారు.
మహానాడు లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో 12అంశాలపై చర్చిoచారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ అమరులకు సంతాపం తెలిపింది. టీడీపీ పోలిట్ బ్యూరో.
సమావేశ నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. ఇటీవల చనిపోయిన పార్టీ నేతలు శ్రేణులకు పొలిట్ బ్యూరో నివాళులర్పించింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీ, త్రివిధ దళాలకు పొలిట్ బ్యూరో అభినందిస్తూ తీర్మానం చేసింది. పద్మభూషణ్ అందుకున్న పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది.
కడపలో తొలిసారి నిర్వహించే మహానాడుకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తక్కువ సమయమే ఉన్నా ఎవరికీ ఏ లోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు చెప్పారు. శతాబ్దాల రాయలసీమ సమస్యల పరిష్కారానికి మహానాడు వేదిక కానుందన్నారు. కడప గడ్డపై యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ అమలుకు మహానాడు నాంది పలకనుంది. లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీతో మహానాడు నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
Operation Sindoor: భుజ్ ఎయిర్బేస్కు రాజ్నాథ్ సింగ్
Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ
బలూచిస్థాన్లో హిందూ మహిళ హవా