Pattabhi: పాపం కసిరెడ్డి.. జగన్ ఏమైనా చేయగలడు.. పట్టాభి సెన్సేషనల్ కామెంట్స్
ABN , Publish Date - Jun 01 , 2025 | 07:03 PM
సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ నేత, ఏపీ స్వచ్ఛాంధ్రా చైర్మన్ పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కడప : టీడీపీ మహానాడు వేదిక ఏర్పాట్ల మెటీరియల్ తొలగింపు పనులను ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ స్వచ్ఛాంధ్రా చైర్మన్ పట్టాభి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వచ్ఛ మహానాడు
ఈ నేపథ్యంలోనే ఈ సారి స్వచ్ఛ మహానాడు నిర్వహించామన్నారు. మహానాడు ప్రాంతాన్ని కార్యక్రమం అయిన తర్వాత కూడా స్వచ్ఛప్రాంతంగా చేస్తున్నామని తెలిపారు. కడపలో జరిగిన మహానాడును చూసి ఓర్వలేక వైసీపీ వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ పార్టీని ప్రజలు అరుంధతి సినిమా వలె సమాధి కట్టేశారని వ్యాఖ్యానించారు.
ఏమైనా చేయగలడు
ఏడాది క్రితం వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది.. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని పేర్కొన్నారు. విచారణలో ఆయన పేరు చెప్తే మా ప్రాణాలు దక్కవంటూ కసిరెడ్డి అనడం ఏమను కోవాలి? చిన్నానని చంపిన జగన్ ఎవరిని ఏమైనా చేయగలడంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కాబోతుందని స్పష్టం చేశారు.
Also Read:
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి కార్యక్రమాలు.. జగన్పై ఎంపీ ఫైర్
సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో కుటుంబం
For More Telugu News