Share News

Appalaraju Police Abuse: రెచ్చిపోయిన వైసీపీ మాజీ మంత్రి.. పోలీస్‌ స్టేషన్‌లో బీభత్సం

ABN , Publish Date - May 26 , 2025 | 04:45 PM

Appalaraju Police Abuse: పోలీసులతో మాజీ మంత్రి సిదిరి అప్పలారాజు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద మాజీ మంత్రి వీరంగం సృష్టించారు.

Appalaraju Police Abuse: రెచ్చిపోయిన వైసీపీ మాజీ మంత్రి.. పోలీస్‌ స్టేషన్‌లో బీభత్సం
Appalaraju Police Abuse

శ్రీకాకుళం, మే 26: జిల్లాలోని వజ్రపుకొత్తూరులోని గరుడభద్రలో పోలీసులపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు (Former Minister Sidiri Appalaraju) విరుచుకుపడ్డారు. గ్రామంలో ఇరు వర్గాల మధ్య భూ వివాదం జరిగింది. వైసీపీకి చెందిన పలువురు ఆక్రమణలకు పాల్పడటంతో గ్రామస్తులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో విషయం తెలిసిన మాజీ మంత్రి అప్పలరాజు పోలీస్‌ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐ తిరుపతిరావును (CI Tirupati Rao) దుర్భాషలాడిన సిదిరి అప్పలరాజు తీరుపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


అధికారంలో ఉన్నప్పుడు బరితెగించి ప్రవర్తించిన వైసీపీ నేతలు.. అధికారం కోల్పోయినప్పటికీ అదే తీరులో వ్యవహరిస్తున్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భావనలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా.. పోలీసులతో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో విశాఖపట్నంలోని ఓ ఆశ్రమం వద్ద జరిగిన ఘటనలో పోలీసులను ఏకవచనంతో పిలుస్తూ మాట్లాడటం, అసభ్యపదజాలంతో దూషించిన అప్పలరాజు ఈరోజు కూడా వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద వీరంగం సృష్టించారు. గరుడభద్ర గ్రామంలో నిన్న (ఆదివారం) సాయంత్రం ఓ వివాదం చోటు చేసుకుంది. ప్రధానంగా వైసీపీకి చెందిన కొంతమంది నేతలు గ్రామకంటం భూమిని ఆక్రమించుకుని అక్కడ షెడ్డు వేసేందుకు ప్రయత్నించారు. వీరి ఆక్రమణను చూసి పలువురు గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు రెచ్చిపోయారు. అడ్డుకున్న గ్రామస్తులపై ఒక్కసారిగా కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


అయితే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అప్పలరాజు వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్ వద్దకు కార్యకర్తలను వెంటేసుకుని వెళ్లి పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులను ఏకవచనంతో పిలుస్తూ దుర్భాషలాడారు. పోలీస్‌స్టేషన్ వద్ద మాజీ మంత్రి బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా సీఐ తిరుపతిరావుపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘నువ్వేమనుకుంటున్నావు. నువ్వెంత నీ పదవెంత’ అంటూ పోలీసు అధికారిపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు మాజీ మంత్రిని నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పలరాజు మాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే మాజీ మంత్రితో వచ్చిన కార్యకర్తలు ఒక్కసారిగా సీఐపై ఎగబడే ప్రయత్నం చేయగా.. సీఐ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. పోలీసస్టేషన్‌కు వచ్చి దుర్భాషలాడి ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదంటూ మాజీ మంత్రికి సీఐ తిరుపతిరావు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై మాజీ మంత్రి అప్పలరాజు ప్రవర్తించిన తీరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి

మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ

సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు

Read Latest AP News And Telugu News

Updated Date - May 26 , 2025 | 05:39 PM