Share News

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:36 AM

రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ బారిన పడ్డారు. కర్నూలు రూరల్‌ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి..

AP Covid Update: రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు

  • కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నమోదు

కర్నూలు హాస్పిటల్‌/నెల్లూరు(వైద్యం), జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్‌ బారిన పడ్డారు. కర్నూలు రూరల్‌ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి దగ్గు, జ్వరంతో బాధపడుతూ జీజీహెచ్‌కు వచ్చింది. ఆమెకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా.. శుక్రవారం కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బాధిత యువతిని కొవిడ్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు కర్నూలు జీజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీరాములు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 8కి చేరింది. అలాగే నెల్లూరులోని మూలాపేటకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. అయితే తీవ్రత తక్కువగా ఉండడంతో బాధితుడిని హోంఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, జిల్లాల్లో గురువారం ఆరు పాజిటివ్‌ కేసులను గుర్తించారు. ఆయా కేసులకు సంబంధించి బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని వైద్యాధికారులు గుర్తించి పరీక్షలు నిర్వహించారు. 27 మందికి ఈ పరీక్షలు చేయగా, ఒకరికి కొవిడ్‌ ఉన్నట్లు తేలింది. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 04:38 AM