Mudragada Health: ముద్రగడకు క్యాన్సర్
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:29 AM
తన తండ్రి ముద్రగడ పద్మనాభం ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో నివాసముంటున్న ఆయన కూతురు క్రాంతి శుక్రవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఆయనతో మాట్లాడనివ్వడం లేదు
ఎక్స్లో పద్మనాభం కుమార్తె క్రాంతి ఆవేదన
కిర్లంపూడి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): తన తండ్రి ముద్రగడ పద్మనాభం ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని రాజమహేంద్రవరంలో నివాసముంటున్న ఆయన కూతురు క్రాంతి శుక్రవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. తాను తన తండ్రిని చూడడానికి కిర్లంపూడి వెళితే తన సోదరుడు గిరి, అతడి మామ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, తన తండ్రితో ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదని పేర్కొన్నారు. ఇది మానవత్వం కాదని గిరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.