Share News

School Fee Assistance AP: తల్లికి ఆనందం

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:44 AM

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెలో తల్లులను పలకరించినా... ఇవే ముచ్చట్లు! కూటమి సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలైంది.

School Fee Assistance AP: తల్లికి ఆనందం

  • సంతాన లక్ష్మికి లక్ష్మీ కటాక్షం కూటమి సర్కారుకు ‘వందనం’

  • జగన్‌ హయాంలో ఇంటికి ఒక్కరికే

  • నేడు.. చదువుకుంటున్న వారందరికీ!

  • విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ

  • ముగ్గురు పిల్లలున్న వారు 2 లక్షలకు పైగానే

  • నలుగురు పిల్లలున్న వారూ భారీగానే

  • ‘తల్లికి వందనం’ నిధుల జమ దాదాపుగా పూర్తి

(అమరావతి, న్యూస్‌నెట్‌వర్క్‌ - ఆంధ్రజ్యోతి)

వదినా... నీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

పక్క వీధిలో మా బంధువులున్నారు. మూడు పదమూళ్లు... 39 వేలు పడ్డాయట!

పిల్లల స్కూలు ఫీజుకోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పిపోయింది!

సైకిల్‌పై స్కూలుకు వెళ్లాలని పెద్దోడి ఆశ! కొనిచ్చేస్తా! చిన్నోడినీ సైకిల్‌పై తీసుకెళతాడు!

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ పల్లెలో తల్లులను పలకరించినా... ఇవే ముచ్చట్లు! కూటమి సర్కారు కొలువుదీరి ఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బులు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలైంది. సాంకేతిక ఇబ్బందులున్నవి మినహా... మిగిలిన అందరికీ శుక్రవారంనాటికి డబ్బులు జమ అయ్యాయి. ఇక... ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు కాగానే వారి తల్లులకూ సొమ్ములు అందుతాయి. ‘ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంతమందికీ అమ్మ ఒడి ఇస్తాం’ అని అధికారంలోకి వచ్చిన జగన్‌... ఆ తర్వాత, విద్యార్థుల లెక్క పక్కనపెట్టి, తల్లులకు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు! ‘ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు... చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తాం’ అని చెప్పారు! చేసి చూపించారు. అప్పటిలాగానే... విద్యాసంస్థల నిధి కోసం రూ.2వేలు మినహాయించుకుని, ఒక్కో విద్యార్థికి రూ.13వేల చొప్పున, ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అన్ని 13వేలు తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో... ఆయా కుటుంబాలకు భారీగా లబ్ధి చేకూరింది. మరీ ముఖ్యంగా... సంతాన లక్ష్ములకు లక్ష్మీ కటాక్షం లభించింది. ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఐదుగురికి ‘తల్లికి వందనం’ సొమ్ములు జమ అయినట్లు ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడైంది.


ప్రభుత్వ అంచనా ప్రకారం... ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది చదువుకుంటున్న పిల్లలున్న కుటుంబాల సంఖ్య లక్షల్లోనే ఉంది. ఒక్కరు పిల్లలున్న కుటుంబాల సంఖ్య 18,55,760. ఇక... ఇద్దరు పిల్లలున్న కుటుంబాల సంఖ్య 14,55,322. వీరందరికీ... వైసీపీ హయాంకంటే రెట్టింపు సొమ్ములు అందినట్లే. ఇక... ము గ్గురు పిల్లలున్న తల్లులు 2,10,684. వీళ్లందరికీ... రూ.39 వేల చొప్పున ‘తల్లికి వందనం’ అందుతోంది. ఇక... 20వేల కుటుంబాల్లో నలుగురు పిల్లలున్నారు. వీరి ఖాతాల్లో రూ.52 వేలు జమయ్యాయి, అవుతున్నాయి! అతి తక్కువ గా ఐదారుగురు పిల్లలున్న తల్లులూ ఉన్నారు. ఏదేమైనా.. జగన్‌ హయాంతో పోల్చితే రెట్టింపు లబ్ధి జరిగినట్లే!.

Updated Date - Jun 14 , 2025 | 03:46 AM