Minister Agricultural Success: ఆదర్శ రైతు మంత్రి నిమ్మల
ABN , Publish Date - May 09 , 2025 | 05:44 AM
జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తన ఆరెకరాల భూమిలో 65 బస్తాల వరి దిగుబడి సాధించి ఆదర్శ రైతుగా నిలిచారు. మంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ, ప్రతి వారం రెండు రోజులు నియోజకవర్గంలో ఉంటూ, సాగులో కృషి చేస్తారు

ఎకరానికి 65 బస్తాల దిగుబడి
పొలంలో తాను పండించిన వరి పంటను ఆప్యాయంగా చూసుకుంటున్నది జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్ర మంత్రిగా ఊపిరిసలపని పనుల్లో ఉన్నా.. ఆయన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయరు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలోని తన ఆరెకరాల వ్యవసాయ భూమిలో దాళ్వా సీజన్లో పీఆర్ 126 సన్నరకం (గ్రేడ్ ఏ) వంగడంతో సాగు చేసి, ఎకరానికి 65 బస్తాల దిగుబడి సాధించి, ఆదర్శ రైతుగా నిలిచారు. మంత్రిగా ఎంత బిజీగా ఉన్నా.. నియోజకవర్గానికి వారానికి రెండు రోజులు కేటాయిస్తారు. ఆ సమయంలోనే వీలైనప్పుడల్లా పొలానికి వెళతారు. నాట్లు వేయడం, కలుపు తీయడం, ఎరువులు చల్లడం, పురుగులమందు పిచికారి చేయడం.. ఇలా అన్ని పనులూ చేస్తారు.. దగ్గరుండి కూలీలతో చేయించుకుంటారు. అతి తక్కువ పెట్టుబడితో.. యాజమాన్య పద్ధతులు, శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాలతో మంత్రి నిమ్మల అధిక దిగుబడి సాధించారని పాలకొల్లు ఏడీఏ పార్వతి, ఏడీ రాజశేఖర్ తెలిపారు.
- పాలకొల్లు అర్బన్, ఆంధ్రజ్యోతి