Minister Kolusu Parthasarathi: మార్చి నాటికి పేదల ఇళ్లు పూర్తి
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:58 AM
గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి జిల్లా హౌసింగ్ అధికారులు రోజూ లేఅవుట్లను పరిశీలించి, నిర్మాణ సామగ్రి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పారు.

అధికారులకు మంత్రి కొలుసు నిర్దేశం
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయాలని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు నిర్దేశించారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల హౌసింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హౌసింగ్ ఏఈలు ప్రతిరోజూ లే అవుట్లను సందర్శించాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్జైన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఎం. శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.