జగన్ యాత్ర... వర్క్ ఫ్రమ్ ఓదార్పులా ఉంది: అనిత
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:59 AM
ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాలి. కాని జగన్ చేస్తున్న ఓదార్పు ఏంటో అర్థం కావడం లేదు. వర్క్ ఫ్రమ్ ఓదార్పు యాత్రలా ఆయన పరిస్థితి ఉంది అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.

విజయనగరం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాలి. కాని జగన్ చేస్తున్న ఓదార్పు ఏంటో అర్థం కావడం లేదు. వర్క్ ఫ్రమ్ ఓదార్పు యాత్రలా ఆయన పరిస్థితి ఉంది’ అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. స్వర్ణాంధ్రవిజన్-2047 ప్రణాళిక, పీ 4 కార్యక్రమాలపై సమీక్షించేందుకు గురువారం విజయనగరం జిల్లాకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం. బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చాం. అయినా జడ్ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పడం సరికాదు. వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని అనిత అన్నారు.