Share News

రైతులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:33 AM

నంద్యాల మార్కెట్‌ యార్డులో రైతుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు అన్నారు.

రైతులకు అండగా ఉంటాం
బాధ్యతలు స్వీకరిస్తున్న హరిబాబు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మార్కెట్‌ యార్డులో రైతుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం శుక్రవారం మార్కెట్‌యార్డు కార్యాలయంలో డిప్యూటీ డైరక్టర్‌ కల్పన సమక్షంలో చైర్మన్‌ చాంబర్‌లో హరిబాబు బాధ్యతలు చేపట్టారు. చైౖర్మన్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నారు. రైతుకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 01:33 AM