విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:37 AM
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ డిమాండు చేశారు.

నంద్యాల రూరల్, జూన్ 12(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ డిమాండు చేశారు. గురువారం పట్టణంలోని గాంధీచౌక్లో ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు సొంత గనులను ఏర్పాటు చేయాల న్నారు. కాంట్రాక్టు వర్కర్స్ను వెంటనే విధుల్లోకి తీసుకోవా లన్నారు. కార్యక్రమంలో నాయకులు సుంకయ్య, ప్రసాద్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.