శ్రీశైల క్షేత్రంలో పారిశుధ్య పనులు
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:28 AM
స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీశైల క్షేత్ర పరిధిలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీశైలం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీశైల క్షేత్ర పరిధిలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగా ధర మండపం నుంచి నందిగుడి వరకు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, అధికా రులు, సిబ్బంది ప్లకార్డులు పట్టుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. పారి శుధ్య కార్యక్రమం కోసం క్షేత్రపరిధిని 6 జోన్లు, 11 సెక్టార్లుగా, 66 ప్రదేశాలుగా విభజించి పారిశుధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జోనుకు దేవస్థానం యూనిట్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. ప్రధాన రహదారులు ఆలయం ముందు గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు దర్శనం క్యూకాంప్లెక్స్, అన్న ప్రసాద వితరణ భవనం, సీఆర్వో కార్యా లయం, మల్లికార్జున సదనం, దేవస్థానం వైద్యశాల, పీహెచ్సీ, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, పాతళగంగమెట్లమార్గం, సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, తదితర ప్రాతాలలో పారిశుధ్య పనులు చేపట్టారు.