బక్రీద్ ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:51 PM
బక్రీద్ను జరుపుకోవడానికి ఈద్గాల్లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పరిశీలించారు.

నంద్యాల రూరల్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): బక్రీద్ను జరుపుకోవడానికి ఈద్గాల్లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పరిశీలించారు. శుక్రవారం పట్టణంలోని భీమవరం రోడ్డులో ఉన్న ఈద్గాలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఏర్పాట్ల గురించి ఈద్గా కమిటీ సభ్యులను అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.