మహాసభలను జయప్రదం చేయండి
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:29 AM
డోన్ పట్టణంలో జూలై 30, 31 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు.

ఆత్మకూరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): డోన్ పట్టణంలో జూలై 30, 31 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్మకూరులోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో వారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో జూలై 30, 31 తేదీల్లో డోన్ పట్టణం కేంద్రంగా జిల్లా సభలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సభలకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు బాబా ఫకృద్దిన్, వెంకట శివుడు, అహ్మద్హుసేన్, లల్లు, చాంద్బాషా, అతావుల్లా, బీసన్న, రవూఫ్ తదితరులు ఉన్నారు.