Share News

ఆరోగ్య కేంద్రం తనిఖీ

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:49 PM

మిడుతూరులోని ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆరోగ్య కేంద్రం తనిఖీ
మాట్లాడుతున్న డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత

మిడుతూరు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మిడుతూరులోని ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో ఓపి వివరాలు, మందుల పంపిణీ, మందుల స్టాకు వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్య అధికారి తిరుపతి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎమ్‌లకు అనుబంధ ఆహారం డే సందర్భంగా ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్‌ వారు ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీహెచ్‌ఎఎస్‌ డాక్టర్‌ లలిత, ఐఏపీ ప్రెసిడెంట్‌ విజయానంద్‌, సెక్రటరీ వీర రత్నాకర్‌ రెడ్డి , సీడీపీవో కోటేశ్వరమ్మ హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఐఏపీ ట్రెజరర్‌ ప్రకాష్‌ ఆనంద్‌ వైద్య అధికారులు శారద, సాయిసుధ, భరత్‌ కుమార్‌, వీణ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సత్యనారాయణ వైద్య సిబ్బంది, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు రేణుక దేవి, వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:49 PM