విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:18 AM
మండలంలోని అల్లూరు గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు.

నందికొట్కూరు రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లూరు గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు. గురువారం అల్లూరులో జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్రావు ఆధ్వర్యంలో భూమి పూజనిర్వహించారు. వారు మాట్లాడుతూ నందికొట్కూరు మండలంలో లో ఓల్టేజీ విద్యుత్ సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న అల్లూరు, వడ్డెమాను, కోనేటమ్మపల్లె, శాతనకోట, మల్యాల, జంగంపాడు, గ్రామాలకు ఇక నుంచి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలవుతుందన్నారు. ఆత్మకూరు విద్యుత్ ఈఈ జయశంకర్, కన్స్ట్రక్షన్ ఈఈ శ్రీనివాసులు, నందికొట్కూరు డీఈ వి. శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాదరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి, మాండ్ర సురేంద్రనాథరెడ్డి, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, పలుచాని మహేశ్వరెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రంపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య అఽధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఫ నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యశర్మ, మున్సిపల్ కమిషనర్ బేబి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.