శివాలయ జీర్ణోద్ధరణకు భూమి పూజ
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:53 PM
మండలంలోని సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో నాగలింగేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

పాణ్యం, జూన్ 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో నాగలింగేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. శుక్రవారం ఆలయ ఈవో రామకృష్ణ ఆద్వర్యంలో శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని ప్రభుత్వ శ్రేయోనిధులు రూ. కోటి 25 లక్షలతో నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె పాణ్యంలోని ఇందిరానగర్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెంచు యువకుని కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. టీడీపీ నాయకులు మిలిటరీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, రామ్మోహన్ నాయుడు, అమరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణమూర్తి, ఖాదర్బాషా, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి నాగేశ్వరరావు, అర్చకులు నారాయణస్వామి, సురేష్శర్మ, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.