Sujatha Slams Jagan: ఆ కారణంతోనే మహిళలపై జగన్ కక్ష సాధింపు.. మాజీ మంత్రి ఆగ్రహం
ABN , Publish Date - Jun 11 , 2025 | 04:14 PM
Sujatha Slams Jagan: మహిళలపై ఎందుకీ విద్వేషం, ద్వేషం, అరాచకాలు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీ వాడైనా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అమరావతి, జూన్ 11: పొదిలిలో మహిళలపై వైసీపీ మూకలు, గూండాలు రాళ్లు, బీరు బాటిళ్ళు, చెప్పులతో దాడి చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peethala Sujatha) తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి మహిళలను సంకర జాతి అన్న సజ్జలది అసలు మానవ జాతే కాదన్నారు. మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ రెడ్డి (Former CM YS Jagan Reddy) వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సాక్షిని అడ్డంపెట్టుకొని మహిళా లోకాన్నే అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘మొన్నేమో మహిళలను వేశ్యలు అన్నారు.. నిన్న సంకర జాతి అన్నారు... నేడు పొదిలిలో బీర్ బాటిళ్ళతో దాడి చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలపై ఎందుకీ విద్వేషం, ద్వేషం, అరాచకాలు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడితే సొంత పార్టీ వాడైనా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు జగన్, భారతి రెడ్డి కలిసి సాక్షి డిబేట్లో మహిళలను కించపరిచేలా పేటీఎం జర్నలిస్టుతో మాట్లాడిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఒక మహిళ అయి ఉండి మహిళలను వేశ్యలు అనడాన్ని ఖండించకుండా తిరిగి ప్రభుత్వాన్నే దూసిస్తోందంటూ మాజీ మంత్రి రోజాపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తల్లుల పెంపకం సరిగా లేదని, తాగిన మైకంలో రేప్ చేశారని, ఒక రేప్, రెండు రేపులకే ఏదో అయిపోతుందని అన్నదే వైసీపీ మహిళా నేతలు అని గుర్తుచేశారు. నేడు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడించిన జగన్ రెడ్డి, భారతి రెడ్డిలు.. వాళ్ళ ముక్కును అమరావతి నేలకు రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలని పీతల సుజాత డిమాండ్ చేశారు.
కాగా.. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మహిళలు అడ్డుకున్నారు. సాక్షి ఛానల్లో మహిళలను అవమానపరుస్తూ నిర్వహించిన డిబేట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పొదిలిలో నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో మహిళలు నిరసన తెలుపుతూ జగన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. మహిళలపై ఇలా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ఓపెన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. చామల సూటి ప్రశ్న
Read latest AP News And Telugu News