Share News

Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ABN , Publish Date - May 08 , 2025 | 12:47 PM

Jethwani Case: ముంబై నటి జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానా తాతా‌తో పాటు మరికొంత మందికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది.

Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
Jethwani Case

అమరావతి, మే 8: ఏపీలో సంచలనం సృష్టించి ముంబై నటి జెత్వాని (Mumbai Actress Jethwani) కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. నటి జెత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానా తాతా, పోలీసు అధికారులు ACP హనుమంతరావు, సత్యనారాయలపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే క్వాష్ పిటిషన్లపై తుది విచారణను జూన్ 30కు హైకోర్టు వాయిదా వేసింది.


vishal-guni-kanti-rana.jpg

గత ప్రభుత్వంలో నటి జెత్వానీని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు హుటాహుటిన ముంబై వెళ్లి నటి జెత్వానిని విజయవాడకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి వివరించింది జెత్వాని. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానా తాతా పాత్ర ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో మే 5న విచారణకు రావాల్సిందిగా ఇద్దరు ఐపీఎస్ అధికారులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఇరువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఈ కేసుపై ధర్మాసనం ముందు విచారణకు రాగా.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, క్రాంతి రానాపై తదుపరి చర్యలు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది.


గతంలో కూడా విశాల్ గున్నీని సీఐడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అయితే ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశానని... ముంబై వెళ్లి నటి జెత్వానీని అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అలాగే కాంతి రానా తాతాను కూడా సీఐడీ విచారించింది. మరోవైపు ఈ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. మే 21 వరకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. విచారణ సమయంలో విశాల్ గున్నీ చెప్పిన అంశాలు నిజం కాదని పీఎస్సార్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే తాను ఈ అంశంపై కాంతి రాణాతో కూడా మాట్లాడలేదని పీఎస్‌ఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రశ్నించేందుకు సీఐడీ నోటీసులు ఇవ్వగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు.


ఇవి కూడా చదవండి

AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం.. ఆ ముగ్గురికి సుప్రీంలో ఎదురుదెబ్బ

Pawan Viral Tweet: ప్రధాని మోదీపై పవన్ సంచలన ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 01:06 PM