Share News

CID To AP High Court: విచారణకు రావాలని వేధించడం లేదు

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:55 AM

నటి కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్‌ అధికారి కాంతిరాణా తాతా చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టులో తెలిపారు. క్వాష్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 28న తుది విచారణ జరగనుంది

CID To AP High Court: విచారణకు రావాలని వేధించడం లేదు

  • కాంతిరాణా క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టుకు తెలిపిన సీఐడీ

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో తరచూ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని వేధిస్తున్నామన్న ఐపీఎస్‌ అధికారి కాంతిరాణా తాతా ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. ఈ మధ్యకాలంలో విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇవ్వలేదన్నారు. కౌంటర్‌ దాఖలు చేశాక.. క్వాష్‌ పిటిషన్‌పై తుది విచారణ జరపాలని కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేశారు.

Updated Date - Apr 09 , 2025 | 04:57 AM