PSR Medical Examination: పీఎస్ఆర్కు మళ్లీ వైద్య పరీక్షలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:52 AM
గ్రూపు-1 పరీక్ష పేపర్లు మూల్యాంకనంలో అవకతవకలకు సంబంధించిన కేసులో రిమాండ్ ఖైదీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించబడ్డారు. వైద్యుల సూచన మేరకు మళ్లీ మరొకసారి వైద్య పరీక్షలు చేయనున్నట్టు తెలియజేశారు.

విజయవాడ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును జైలు సిబ్బంది సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీపీలో హెచ్చుతగ్గులు, రాత్రిపూట నిద్రపట్టడం లేదని ఆయన ఇటీవల చెప్పడంతో ఒకరోజు ఆస్పత్రిలో ఉంచారు. మళ్లీ అదే సమస్యను చెప్పడంతో సోమవారం జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో వైద్య పరీక్షలు చేయించి సాయంత్రం వరకు పరిశీలనలో ఉంచారు. అనంతరం డిశ్చార్జి చేయడంతో తిరిగి జైలుకు తరలించారు. మంగళవారం మరోసారి వైద్యపరీక్షల కోసం పీఎ్సఆర్ను తీసుకురావాలని వైద్యులు సూచించినట్టు అధికారులు తెలిపారు.