Share News

Group-1 Scam Unveiled: గ్రూప్‌-1 పేపర్లు దిద్దిన వెల్డర్‌

ABN , Publish Date - May 09 , 2025 | 04:02 AM

గ్రూప్-1 పరీక్షల పత్రాల మూల్యాంకనం కేసులో వెల్డర్‌ పాత్ర వెలుగులోకి వచ్చింది. విచారణలో పేపర్లపై చేర్చిన తప్పుడు సంతకాలు, స్టాంపులు, రీచెక్‌కు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు

Group-1 Scam Unveiled: గ్రూప్‌-1 పేపర్లు దిద్దిన వెల్డర్‌

  • మూల్యాంకనం చేసినట్లు పేపర్‌పై సంతకం

  • ఏపీపీఎస్సీ సిబ్బంది మెడకు ‘పునఃపరిశీలన’

  • రీచెక్‌ చేయకుండానే సంతకం పెట్టి, స్టాంపు

  • ఐదుగురి అరెస్టుకు పోలీసులు సన్నద్ధం

విజయవాడ, మే 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షల పత్రాల మూల్యాంకనం కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వెల్డర్‌ పేరునూ అక్రమాలకు వాడుకున్నారు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం పేరిట జరిగిన తంతులో గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఒక వెల్డర్‌ను వివిధ పనులకు ఉపయోగించుకున్నారు. స్ట్రాంగ్‌రూంలో ఉన్న పేపర్లను తీసుకురావడం, వాటిని గోనెసంచుల్లో పెట్టి తిరిగి స్ట్రాంగ్‌రూంకు మోసుకెళ్లడం వంటి పనులు ఆయన చేశారు. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించి, ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో మాత్రమే ఈ పేపర్లు మూల్యాంకనం చేయించాలి. ప్రతి పేపర్‌ వెనుక దాన్ని దిద్దిన ప్రొఫెసర్‌ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. అయితే ఆ స్థానంలో వెల్డర్‌తో, ప్రైవేటు టీచర్‌తో, గర్భిణి అయిన గృహిణితో సంతకాలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ చిరునామాలను పట్టుకుని విచారణకు వెళ్తే సంతకాలు చేసిన వారి అసలు హోదాలు బయటపడుతుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. హాయ్‌ల్యాండ్‌లో నాడు జరిగిన వ్యవహారాల్లో పాత్ర ఉన్న వారందరినీ దర్యాప్తు అధికారి ఏబీజీ తిలక్‌ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి.


2020 డిసెంబరులో గ్రూప్‌-1 మెయిన్స్‌ నిర్వహించారు. డిజిటల్‌ మూల్యాంకనం అనంతరం ఫలితాలు విడుదల చేశారు. దీనిపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో డిజిటల్‌ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆదేశాలతో కమిషన్‌ కార్యాలయం నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను అక్రమంగా హాయ్‌ల్యాండ్‌కు తరలించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామకు చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు సతీశ్‌ కూడా పాల్గొన్నారు. తనకు రోజుకు రూ.2వేలు చొప్పున ఇస్తున్నారని చెప్పి నందిగామ నుంచి మరో ఐదుగురిని కూడా అతను హాయ్‌ల్యాండ్‌కు తీసుకెళ్లినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాగా, నిబంధనల ప్రకారం ఒకసారి ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేసిన తర్వాత వాటిని పునఃపరిశీలించాలి. దీన్నే రీచెక్‌ అంటారు. ఈ పనిని ఏపీపీఎస్సీ సిబ్బంది చేశారు. రెండోసారి మూల్యాంకనం చేయని పత్రాలపై పునఃపరిశీలన జరిగినట్టుగా కమిషన్‌ ఉద్యోగులు సంతకాలు చేసి, స్టాంపులు వేశారు. ఈ విధంగా చేసిన ఐదుగురికి సంకెళ్లు వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.


పోలీసులు విచారించారని ఆత్మహత్యాయత్నం

గ్రూపు-1 పరీక్ష పత్రాలను డిజిటల్‌ మూల్యంకనం చేసిన కేసులో పాత్ర పోషించిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. నాడు పరీక్షా పత్రా లు దిద్దినట్టు సంతకాలు చేసిన వారిలో మొత్తం 66మందిని ప్రత్యేక బృందం గుర్తించి, విచారిస్తోం ది. ఇందులో భాగంగా నందిగామలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న సతీశ్‌ను పోలీసులు విచారించారు. మాన్యువల్‌గా మూల్యాంకన ం చేసినట్టుగా పేపర్లపై సంతకాలు సంతకాలు చేసినవారిలో సతీశ్‌ కూడా ఒకరు. పది రోజుల క్రితం పోలీసులు ఆయన్ను విచారించి వాంగ్మూ లం తీసుకున్నారు. అప్పట్లో ఏం జరిగిందో పోలీసులకు వివరించిన సతీశ్‌... కేసులో ఇరుక్కుంటానన్న భయంతో వారం క్రితం ఇంట్లో ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన డిజిటల్‌ మూల్యాంకనంలో పాల్గొన్న సతీశ్‌ను విచారించి వాంగ్మూలం తీసుకున్నామని పోలీసులు ధ్రువీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..

ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 04:02 AM