Atchennaidu: ఉత్సాహంగా ఏరువాక
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:28 AM
తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది.

అధికారికంగా నిర్వహించిన వ్యవసాయ శాఖ.. 20న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల: మంత్రి అచ్చెన్న
అమరావతి, పెదవేగి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): తొలకరి చినుకులు రాలిన వేళ.. రైతు పండుగ ‘ఏరువాక’ ఉత్సవం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఏటా జూన్ నెలలో వచ్చే పౌర్ణమినాడు జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరులో బుధవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి నాగలితో పొలం దున్ని ఏరువాక పౌర్ణమిని ప్రారంభించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఏరువాక ఉత్సవాన్ని ప్రారంభించారు. నవధాన్యాలు పొలంలో చల్లి, ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి, దండిగా దిగుబడులతో రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలో రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా అన్నదాత సుఖీభవ పథకంలో ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పఽథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్ డిల్లీరావు, కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఏరువాక కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ డిల్లీరావు రైతులకు వివరించారు.