పోస్టుమార్టం!
ABN , Publish Date - May 17 , 2025 | 01:37 AM
కాకినాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తమ ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిం ది. ముఖ్యంగా ఆ పార్టీ నేతలు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. డీబీటీ పద్ధతిలో ప్రజలకు అనేక పథకాల పేరుతో వారి ఖాతాల్లో డబ్బులు వేసినా.. అభివృద్ధిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది ఆ ప్రభుత్వం. అంతేకాదు ఆ పార్టీ నేతల నోటి దురుసు, దందాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అంతే సంగతులు అని భావించిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అధి కార పీఠం నుంచి కిందకు దించారు. ఉ

పార్టీ ఓటమిపై వైసీపీలో విస్తృత చర్చ
కాకినాడలో సమావేశమైన ఉభయగోదావరి జిల్లాల పార్టీ ప్రతినిధులు, ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు
ప్రభుత్వ వ్యతిరే క విధానాలపై ఆందోళనకు ప్రణాళిక
కాకినాడ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తమ ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిం ది. ముఖ్యంగా ఆ పార్టీ నేతలు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. డీబీటీ పద్ధతిలో ప్రజలకు అనేక పథకాల పేరుతో వారి ఖాతాల్లో డబ్బులు వేసినా.. అభివృద్ధిని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది ఆ ప్రభుత్వం. అంతేకాదు ఆ పార్టీ నేతల నోటి దురుసు, దందాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. మరోసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అంతే సంగతులు అని భావించిన రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని అధి కార పీఠం నుంచి కిందకు దించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొ త్తం 21 సీట్లలో ఒక్కటి కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో గురువారం కాకినాడలోని డీ కన్వెన్షన్ హాలులో ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉభయగోదావరి జిల్లాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ వంగా గీత తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాము ఎందుకు ఓడిపోయాం అనే విషయంపై చర్చించుకున్నారు. అలాగే ఈవీఎం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ బొత్స వ్యాఖ్యానించడం విశేషం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో ఏమేమి చేసింది, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? లేదా? అనే విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఇతర జిల్లాలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తున్నందున.. అదే ఇక్కడ కూడా త్వరలో అమలుచేసే అవకాశం ఉంద న్న విషయంపైనా చర్చించినట్టు తెలిసింది. అలాగే ఈ ఏడాదిలో ప్రభుత్వం ఏయే హామీలను అమలు చేసింది? ఏం చేయలేదు? అనే విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని చర్చించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు. పథకాల అమలుపైనా ఆందోళనకు సిద్ధం కావాలని బొత్స పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే త్వరలోనే పార్టీ బలోపేతం దిశగా గ్రామ, మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు బొత్స వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే.. పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు.