Share News

Pithapuram Kukkuteswara Temple: కార్తీక మాసం మొదటి సోమవారం.. పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Oct 27 , 2025 | 07:16 AM

కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి.. కార్తీక దీపాలు వెలిగిస్తూ..

Pithapuram Kukkuteswara Temple:   కార్తీక మాసం మొదటి సోమవారం..  పిఠాపురం పాదగయ క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
Pithapuram Kukkuteswara Temple

పిఠాపురం, అక్టోబర్ 27: కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుండి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి.. కార్తీక దీపాలు వెలిగిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

పాదగయ క్షేత్రంలో కార్తీక మాస మొదటి సోమవార వైభవం.. పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని పాదగయ క్షేత్రం, త్రిగయా క్షేత్రాల్లో ముఖ్యమైనదిగా ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం. ఇక్కడి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం, శ్రీ పురుహూతికా దేవి శక్తిపీఠంతో కలిసి ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన ప్రాంతంగా స్థానిక భక్తజనం నమ్ముతారు.

kukkuteswara-swami-temple.jpg


ఈ ఆలయం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ మహారాజు జన్మభూమిగా కూడా ప్రసిద్ధి. పురాణాల ప్రకారం, గయాసురుడి యజ్ఞాన్ని కుక్కుట (కోడి) రూపంలో భంగం చేసిన శివుడు ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా స్థిరపడ్డారని ప్రతీతి. తెల్లని లింగస్వరూపంలో దర్శనమిచ్చే స్వామివారు, పితృముక్తి కోసం భక్తులకు మొదటి గయాగా ప్రసిద్ధి చెందారు.

Pithapuram-temple.jpgఈ ఏడాది (2025) కార్తీక మాసం మొదటి సోమవారం (అక్టోబర్ 27) సందర్భంగా, ఈ పవిత్ర క్షేత్రం భక్తులతో అలరారుతోంది. తెల్లవారుజాము నుండే పాదగయ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసిన భక్తజనం, కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు అర్పిస్తున్నారు. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి.

pithapuram-kartika.jpgసూర్యోదయానికి ముందు నిద్రలేచి, నదీ స్నానం చేసి, మహామృత్యుంజయ మంత్రాలు జపించడం, ఆవునేతి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వంటి ఈ నియమాలు పాటించినవారు పుణ్యఫలం పొందుతారని పండితులు చెబుతున్నారు. పాదగయ పుష్కరిణి ప్రాంతంలో ఇప్పుడు దేవదీపాల జ్యోతి, 'హర మహాదేవ' గానాలు, భక్తుల భక్తిభావనలు కలిసి ఒక దైవిక వాతావరణం కనిపిస్తోంది.

pithapuram-kukkuteswara.jpg


ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 07:24 AM