Share News

మార్చి 3న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:24 AM

మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్పీ, అథారిటీ చైర్మన్‌ వి.నరేష్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు.

మార్చి 3న నేషనల్‌ లోక్‌ అదాలత్‌

అమలాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మండల లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీన నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్పీ, అథారిటీ చైర్మన్‌ వి.నరేష్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, బ్యాంకు, చెక్‌ బౌన్స్‌ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవచ్చునన్నారు. కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ కేసులు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Jan 30 , 2025 | 12:24 AM