కల్తీ ఏంటీ..!
ABN , Publish Date - May 12 , 2025 | 12:35 AM
ఉదయం లేవడంతోనే ఒక టీ పడాల్సిందే.. లేదంటే తెల్లారదు.. ముఖంలో ఆ అలసట కనిపిస్తూనే ఉంటుంది.. ఒక చుక్క పడితే.. ఆ ఛాయ్ చమక్కులే చూడరా బాయ్ అని చిరంజీవి అన్నట్టు ఉంటుంది.. డిమాండ్ ఉండడంతో వీధికో టీ దుకాణం వెలసింది.. ఒక్క రాజమ హేంద్రవరంలోనే ప్రతి రోజూ సుమారు 6 లక్షల మంది టీ తాగుతున్నట్టు సమాచారం.. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి ఉంటుంది.. అయితే డిమాండ్కు తగినట్టు నకిలీ టీపొడి విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయినా పట్టించుకునేవారే లేరు.

మార్కెట్లో నకిలీ టీపొడి
విచ్చలవిడిగా అమ్మకాలు
కేజీ రూ.200లు మాత్రమే
చిరు టీస్టాల్స్లో వినియోగం
ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం
కన్నెత్తి చూడని అధికారులు
రాజమండ్రిలో 9 పాయింట్లు
ఉదయం లేవడంతోనే ఒక టీ పడాల్సిందే.. లేదంటే తెల్లారదు.. ముఖంలో ఆ అలసట కనిపిస్తూనే ఉంటుంది.. ఒక చుక్క పడితే.. ఆ ఛాయ్ చమక్కులే చూడరా బాయ్ అని చిరంజీవి అన్నట్టు ఉంటుంది.. డిమాండ్ ఉండడంతో వీధికో టీ దుకాణం వెలసింది.. ఒక్క రాజమ హేంద్రవరంలోనే ప్రతి రోజూ సుమారు 6 లక్షల మంది టీ తాగుతున్నట్టు సమాచారం.. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి ఉంటుంది.. అయితే డిమాండ్కు తగినట్టు నకిలీ టీపొడి విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయినా పట్టించుకునేవారే లేరు.
రాజమహేంద్రవరం సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): నకిలీ వ్యాపారం ఎక్కడ చేయగలరు.. ఎక్కడ ఎక్కువ అమ్మకాలు జరుగుతాయో అక్క డే..ఎందుకంటే అంతా సందట్లో సడేమియా.. ఏం చేసినా తిరుగుండదు..అడిగే దిక్కుండదు. తెలిసినా ఊకొడతారు..ఊరుకుంటారు..ప్రస్తు తం రాజమహేంద్రవరంలో అదే జరుగుతుంది. కల్తీ టీ పొడికి అడ్డాగా మారిపోయింది. ఎందు కంటే ఉమ్మడి జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం..నిత్యం కోట్లలో వ్యాపారలా వాదేవీలు సాగుతాయి.కనీసం కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. దీంతో నకిలీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
ప్రధాన వాణిజ్య కేంద్రంలో ఇలా..
రాజమహేంద్రవరం హోల్సేల్ వ్యాపారానికి ప్రసిద్ధి.మార్కెట్పై వ్యాపారులకు చాలా నమ్మ కం.ఇదే పెట్టుబడిగా కొంత మంది కల్తీ ఆహారపదార్థాలను తయారు చేసి మార్కెట్లోకి దింపి పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారు. ప్రస్తుతం కల్తీ టీపొడి వ్యాపారం జోరుగా సాగుతోంది. క్షణాల్లో తయారు చేసి ప్యాకింగ్ చేసి ఎటు వంటి అనుమానం రాకుండా తరలించేస్తున్నా రు.రాజమహేంద్రవరం మెయిన్రోడ్డులో మూ డు, ఎస్వీజీ మార్కెట్లో 6 పాయింట్లలో కల్తీ టీ పొడి తయారు చేసి విక్రయిస్తున్నారు. కల్తీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. సాధారణం గా ఒరిజినల్ టీపొడి ప్యాకెట్ 250 గ్రా ములు కొనాలంటే రూ.200 నుంచి రూ.260 మధ్య ఉంటుంది.కేజీ టీపొడి కోనాలంటే రూ.600 పైనే ఉంటుంది.కల్తీ టీపొడి రూ.150 నుంచి రూ.200 లోపే వస్తుంది. అంతే కాకుండా చిన్న రూ.5 ప్యాకెట్లు అధికంగా తయారు చేసి మార్కెట్లోకి దింపుతున్నారు.ప్రజలు నాణ్యత చూడక పోవడం కూడా కల్తీకి కారణం.కల్తీ టీపొడి ని యంత్రణలో అధికారులు విఫలమవుతున్నారు.
వీధికో దుకాణం..
టీస్టాల్స్కు కొదువలేదు.. ఉమ్మడి జిల్లాలో ఏ వీధిలో చూసినా ఏదో ఒక మూల టీస్టాల్ కని పిస్తూనే ఉంటుంది.చాలా టీస్టాల్స్లో కల్తీ టీ పొడి వినియోగిస్తున్నారు.ఈ టీ పొడికి కాస్త అల్లం, యాలకుల పొడి తగిలించి సువాసనతో అందించేస్తున్నారు.మంచి రంగు కనిపించడంతో అది కల్తీ అనే సంగతే అంతుపట్టడంలేదు. అ ప్పుడప్పుడు సంబంధిత అధికారులు,ఫుడ్ ఇన్ స్పెక్టర్లు దాడులు చేసి ఫైన్ వేసినా పెద్దగా పట్టించుకోవడంలేదు. పైన్లు కట్టేసి నెమ్మదిగా మళ్లీ కల్తీ టీపొడి తయారు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.కల్తీ టీపొడి పట్టుకున్నప్పుడు వారి వ్యాపార లైసెన్సులు రద్దుతో పాటు వారిపై చట్టప్రకారం కఠిన శిక్షలు లేకపో వడం వల్ల అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు స్పందించి నిఘా పెడితే కల్తీ వ్యాపారాలకు చెక్ పడే అవకాశం ఉంది.
కల్తీ టీపొడి తయారీ ఇలా
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి చింతపిక్కలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటు న్నారు. వాటిని ఎండబెట్టి టీ పోడి మాదిరిగా ఆడిస్తు న్నారు.దానికి జీడీపప్పు పిక్క లోపల ఎర్రని చార తో ఉండే పొరను తీసుకుని దానిని పిండిలా ఆడి స్తున్నారు.అనంతరం ఫుడ్ కలర్స్ కలిపి ఈ మిశ్ర మాన్ని చింతపిక్కల ఫౌడర్లో కలిపి వేడిచేసి గచ్చుపై ఆరబెట్టి ఆరిన తర్వాత టీ పొడి ప్యాకెట్లు తయారుచేస్తున్నారు. ఇందులో కలిపే ఫుడ్ కలర్స్, జీడిపిక్కల పొర కారణంగా జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.ఈ టీ పొడితో కాచిన టీ తాగితే ఖచ్చితంగా జబ్బుపడతారు. ప్రస్తుతం ఈ కల్తీ టీ పొడి తయారీకి రాజమహేంద్రవరం కేంద్రంగా ఉంది.గతంలో అనపర్తిలో తయారుచేస్తే అప్ప టిలో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుం డా నకిలీ టీపొడి వ్యాపారం జోరుగా సాగుతోంది.