Share News

Annavaram: కమనీయం సత్యదేవుడి దివ్యకల్యాణం

ABN , Publish Date - May 09 , 2025 | 04:14 AM

అన్నవరం సత్యదేవుడు అనంతలక్ష్మీ అమ్మవారి వార్షిక కల్యాణం ఘనంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్దఎత్తున హాజరై దివ్య దృశ్యాన్ని వీక్షించారు

Annavaram: కమనీయం సత్యదేవుడి దివ్యకల్యాణం

అన్నవరం, మే 8(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దివ్యక్షేత్రంలో కొలువుదీరిన సత్యదేవుడి వార్షిక కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను గ్రామోత్సవం అనంతరం రాత్రి 9 గంటలకు కల్యాణవేదిక వద్దకు తీసుకువచ్చారు. సుగంధభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై దంపతులను.. మరో వేదికపై పెళ్లి పెద్దలైన సీతారాములను ఆశీనులు గావించి పండితులు కల్యాణతంతుకు శ్రీకారం చుట్టారు. సుముహూర్త వేళ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచారు. స్వామి, అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు. కల్యాణం వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలలనుంచి అధికసంఖ్యలో భక్తులు విచ్చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..

ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 04:14 AM