Wedding: ఘనంగా దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుక
ABN , Publish Date - May 01 , 2025 | 04:57 AM
దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

హాజరైన తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్
కంకిపాడు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్, సాయి నర్మదల వివాహం బుధవారం కంకిపాడులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో వచ్చి, వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ వివాహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కొలుసు పార్థసారధి, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, జనార్దన్రెడ్డి, ఎస్.సవిత, ఎంపీ బాలశౌరి, టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పంచుమర్తి అనురాధ, యార్లగడ్డ వెంకట్రావు, బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, వసంత కృష్ణప్రసాద్, శ్రీరామ్ తాతయ్య, కామినేని శ్రీనివాస్, చంద్రమోహన్ రెడ్డి, పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..